జడ్చర్ల, డిసెంబర్ 17 : అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లవంటివని, వీటిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలస కడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్చర్ల మండలం మాచారం గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మ్యాతిరి మాసయ్య, పానుగంటి గోపాల్, దొడ్ల నర్సింహులు, కుమ్మరి నర్సింహులుతోపాటు పలువురు చేరగా.. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రాష్ర్టాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వట్టిపల్లి రవీందర్రెడ్డి, బాదేపల్లి పీఏసీసీఎస్ మాజీ చైర్మన్ బాల్రెడ్డి, ఉపసర్పంచ్ రవి, నాయకులు పాల్గొన్నారు.
చిన్నంబావి, డిసెంబర్ 17 : తెలంగాణను రోల్ మో డల్గా తీసుకొని ఇక్కడ జరిగిన అభివృద్ధిని దేశవ్యాప్తం గా చేపట్టాలన్నదే కేసీఆర్ లక్ష్యమని కొల్లాపూర్ ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని అ మ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ, ఇత ర పార్టీల నాయకులు 50 మంది శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో కాటమోని కిరణ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తున్నదని చెప్పారు. నూతనంగా ఏర్పడిన మండలాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్తోనే దేశ ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. దార్శనికత కలిగిన కేసీఆర్ వంటి నాయకులు ప్రధాని కావడం ఎంతో అవసరమని చెప్పారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితు లై గులాబీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాదేపల్లి యోగేశ్వర్గౌడ్, మునిస్వామి, జగదీశ్, దాసరి ఈశ్వరయ్య, పరశురాముడు, నరసింహ, రాముడు, నాయకులు పాల్గొన్నారు.