ఆత్మకూరు, జనవరి 6 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖాన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం పట్టణంలోని 4వ వార్డులో బస్తీదవాఖానను కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీదవాఖానల్లో అన్ని రకా ల ప్రాథమిక సేవలు అందుతాయన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు అందజేయనున్నట్లు చెప్పారు.
రూ.13 లక్షల వ్యయం తో పట్టణంలో చేపట్టిన నిర్మాణాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, పాలకవర్గం చొరవ తీసుకొని కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయించారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మం త్రుల నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి రవిశంకర్ మాట్లాడుతూ ఆత్మకూరు, అమరచింతలోనే బస్తీ దవాఖానలను ప్రారంభించినట్లు తెలిపా రు. అంతకుముందు ఎమ్మెల్యే, కలెక్టర్ను చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్చైర్మన్ విజయభాస్కర్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ అధ్యక్షులు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ అధ్యక్షుడు రవికుమార్యాదవ్, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాసులు, ఆర్డీవో పద్మావతి, తాసిల్దార్ సింధూజ, వైద్యాధికారులు లక్ష్మణ్, శ్రీనివాస్చౌదరి, సాయిచంద్, నిస్సార్అహ్మద్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, కమిషనర్ రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.