మక్తల్ టౌన్, జనవరి 12 : ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి, అంధత్వ నివారణను చేపట్లాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు హాల్లో ఎంపీపీ వనజ అ ధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స మావేశంలో 14 అంశాల ఎజెండాలపై నివేదికను ఆయా శాఖల అధికారులు సభ్యులకు వివరించారు.
సభ్యులు అం శాలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ కంటి చూపును అందించాలనే ఉద్దేశంతో కంటి వెలుగు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టార ని పేర్కొన్నారు. 18 ఏండ్ల పై వయస్సు కలిగిన వారందరి కీ ఉచితంగా కంటీ పరీక్షలు నిర్వహించి దూర దృష్టి సమస్య ఉన్న వారికి ప్రభుత్వం అద్దాలను అందజేస్తుందన్నారు. మండలంలో రూ.29 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్వహణకు టెండర్లను పిలిచామన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజ లు ఇబ్బందులకు గురికాకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
మండలంలోని 39 గ్రా మ పంచాయతీలకు సంబంధించి మిషన్ భగీరథ నీటి కనె క్షన్ల వివరాలను గ్రామాల వారీగా అందించాలని డీఈ మద్దిలేటికి ఆదేశించారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనుల వివరాలను వెంటనే అందించి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో తా సిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కో సమే సీఎం సహాయనిధి పథకాన్ని తీ సుకొచ్చారని ఎమ్మెల్యే చిట్టెం అన్నా రు. సీఎం సహాయనిధి నుంచి మం జూరైన చెక్కులను గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన రాజుకు రూ. 35వేలు, పట్టణానికి చెందిన రాములుకు రూ.60వేల విలు వ చేసే చెక్కులను పంపిణీ చేశారు.
కులాంతర వివాహం చేసుకున్న ప్రతి జంటకూ ప్రభు త్వం నుంచి ప్రోత్సాహం అందుతుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండలానికి చెందిన ఇద్దరు నూతన జంటలకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2.50లక్షల చెక్కులను వారికి అందించా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
ఊట్కూర్, జనవరి 12 : కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హా జరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు స మిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు.
విద్య, వై ద్యం, ఉపాధి హామీ, అగ్రికల్చర్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కా ర్యక్రమాలను సభలో చదివి వినిపించారు. చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి తమను ఆహ్వానించ లేదని ఎంపీటీసీ రవిప్రసాద్రెడ్డి అ భ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ పాఠశాల ఉపాధ్యాయులు రాజకీయం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింద ని, ఉద్యోగం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి రాజకీయాలు చేయాలని, బాధ్యతలను విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధి దారుల వద్ద తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది లంచం తీసుకుంటున్నట్లు ఎంపీటీసీలు హన్మంతు, రవిప్రసాద్రెడ్డి ప్ర శ్నించారు. ఎమ్మెల్యే కలుగజేసుకొని అధికారులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. విధులపై నిర్లక్ష్యం వ హిస్తే ఎంతటివారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ఎంఈవో వెంకటయ్య మాట్లాడుతూ మండలంలో 10 ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు సోలార్ సిస్టమ్ మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, తాసిల్దార్ తిరుపతి, ఎంపీడీవో కాళప్ప, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, ఎం పీవో వేణుగోపాల్రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.