నవాబ్పేట, జనవరి 7 : మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవం గా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కాకర్లపహాడ్ గ్రామంలో బ్యాండ్ మేళాలతో అమ్మవారి పట్టువస్ర్తాలు, పసుపు కుంకుమతో దేవాలయ పాలకవర్గ సభ్యులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ లయం వరకు కాలినడకన వెళ్లి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. గణపతి పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలను ని ర్వహించారు.
భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొ క్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ గోపాల్, సర్పంచ్ జంగమ్మ, ఉపసర్పంచ్ పెంటయ్య, ఈవో మదనేశ్వర్రెడ్డి, నాయకులు కృష్ణయ్య, నర్సింహులు, వేణాచారి, సంజీవరెడ్డి, వేణాచారి, మాధవులు, మాసయ్య, బాలకిష్టయ్య, వెంకటేశ్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.