పాలమూరు పట్టణం కొత్త రూపు సంతరించుకున్నది. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రూ.10 కోట్లతో చౌరస్తాల సుందరీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో బుద్ధుడి విగ్రహం మధ్యలో వాటర్ఫాల్, అంబేద్కర్ చౌరస్తాలో పర్వతాల బొమ్మలను రూపొందిస్తున్నారు. పిల్లలమర్రి చౌరస్తాలో మర్రివృక్షం, ఐలవ్ మన మహబూబ్నగర్ ఆకట్టుకుంటున్నాయి. మినీ ట్యాంక్బండ్పై సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్, శిల్పారామం పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు చౌరస్తా పనులన్నీ పూర్తయితే మరిన్ని సొబగులు రానున్నాయి.
మహబూబ్నగర్టౌన్, మార్చి 9 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కొత్తరూపు సంతరించుకుంటున్నది. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ ఆలోచనలను అధికారులు ఆచరణలో పెడుతున్నారు. వందల కోట్లతో పట్టణ రూపురేఖలు మారుస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రూ.10 కోట్ల వ్యయంతో చౌరస్తాల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అశోక్టాకీస్ చౌరస్తా నుంచి క్లాక్టవర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మినీట్యాంక్బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్, శిల్పారామం పనులు జోరందుకున్నాయి. సుభాష్ చంద్రబోస్ జంక్షన్ ను రూ.1.48 కోట్లు, అంబేద్కర్ చౌరస్తాను రూ.1.40 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దుతున్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ పనులను పర్యవేక్షించి.. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుభాష్ చం ద్రబోస్ జంక్షన్ వద్ద ఒక వైపు నేతాజీ, మరో వైపు గౌతమబుద్ధుడు.. మధ్యలో వాటల్ఫాల్, పై భాగంలో నాలుగు సింహాలు, కింద పార్కును ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో పర్వత రూపంలో వాటర్ఫాల్ను నిర్మిస్తున్నారు. ఈ రెండు చౌరస్తాల పనులు పూర్తయితే కొత్తందం సంతరించుకోనున్నది. మరో రూ.43.77 కోట్లతో పట్టణం లో రెండు వరుసల రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
రోడ్ల విస్తరణపై నజర్..
మహబూబ్నగర్ పట్టణంలోని అంతర్గత రహదారుల ను విస్తరించనున్నారు. ఇరుకుగా ఉన్న రోడ్లను రెండు వరుసలుగా మార్చనున్నారు. రోడ్డు వెంట ఉన్న వంతెనలు, కల్వర్టులు సైతం పునరుద్ధరింనున్నారు. అబ్దుల్ఖాదర్ ద ర్గా వద్ద వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. పురపాలక కార్యాలయం సమీపంలో కల్వర్ట్ పనులు పూర్తి చే శారు. ఎంవీఎస్ రోడ్డును కొంతమేర విస్తరించారు. అశోక్టాకీస్ నుంచి క్లాక్టవర్ కూడలి, క్లాక్టవర్ నుంచి పాతబస్టాండ్ మీదుగా బోయపల్లిగేట్, షాషాబ్గుట్ట చౌరస్తా నుంచి బీకేరెడ్డి కాలనీ, కలెక్టర్ బంగ్లా నుంచి తెలంగాణ చౌరస్తా, తెలంగాణ కూడలి నుంచి స్టేషన్రోడ్డు చౌరస్తా, బైపాస్ రోడ్డు నుంచి పాలకొండ వరకు.. ఇలా రహదారుల విస్తరణ, వంతెనలు, కల్వర్టుల పునరుద్ధరణ, చౌరస్తాలను విస్తరించనున్నారు. క్లాక్టవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సంస్థల యజమానులకు పురపాలక శాఖ అధికారులు నెల కిందట నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ తరహాలో..
హైదరాబాద్ తరహాలో మహబూబ్నగర్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే బైపాస్రోడ్డుతోపాటు ప్రధాన రోడ్డును విస్తరించాం. తెలంగాణ, క్లాక్టవర్, సద్దలగుండు, డీఈవో, మెట్టుగడ్డ, న్యూటౌన్, వన్టౌన్, అశోక్టాకీస్ చౌరస్తా పనులు పూర్తయ్యాయి. అంబేద్కర్, సుభాష్చంద్రబోస్ చౌరస్తాల సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. అంతర్గత రోడ్ల విస్తరణపై కూడా దృష్టి పెట్టాం. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
వేగంగా జరుగుతున్న పనులు..
ఒకప్పటి మహబూబ్నగర్కు.. ఇప్పటి ప ట్టణానికి చాలా తేడా ఉన్నది. బీఆర్ఎస్ స ర్కార్ హయాంలో ఊహించని అభివృద్ధి జ రుగుతున్నది. మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు జంక్షన్ల ను పూర్తి చేశాం. సుభాష్చంద్రబోస్, అంబేద్కర్ చౌరస్తాలను అత్యంత సుందరంగా తీ ర్చిదిద్దుతున్నారు. పనులు త్వరగా పూర్తిచేసే లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– నర్సింహులు, మున్సిపల్ చైర్మన్, మహబూబ్నగర్