దేవరకద్ర, నవంబర్ 30: దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని ఎక్స్జ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రభుత్వం దేవరకద్ర నియోజకవర్గానికి నూతనంగా మంజూరు చేసిన మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర డిగ్రీ బీసీ గురుకుల కళాశాలను బుధవారం మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాలకులు 70ఏండ్లుగా విద్యావ్యవస్థను సర్వ నాశనం చేశారన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండేవనని, దొడ్డు అన్నం, నీళ్ల చారు ఇచ్చేవారని గుర్తు చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించానని, పదో తరగతి పరీక్షలు రాసేందుకు వస్తే దేవరకద్రలో ఉండేందుకు వసతి లేకపోవడంతో స్థానిక మసీదులో ఉండి పరీక్షలు రాశానని మంత్రి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విద్యార్థి ఉన్నత చదుకోవాలని నియోజకవర్గ కేంద్రంలో గురుకుల పాఠశాలలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో పిండి సంచుల కోసం క్యూలైన్లో నిలబడి 17మంది రైతులు మృతి చెందారని, తెలంగాణలో అన్నదాతలకు ఎరువులను అందుబాటులో ఉంచిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టువరు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని యువకులు వారి మాటలను నమ్మిమోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి అందజేశారు. కార్యక్రమంలో బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య, తాసిల్దార్ జ్యోతి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు రమాశ్రీకాంత్ యాదవ్, హర్షవర్ధన్రెడ్డి, అన్నపూర్ణ, లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుగుణ, పార్టీ మండలాధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు కొండారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఖదీర్ పాషా, వీరప్ప ఆలయ చైర్మన్ శివానంద్ పాల్గొన్నారు.
ప్రజల సౌకర్యార్థం వారి అభీష్టం మేరకే కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల కేంద్రాన్ని బుధవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా తాసిల్దార్ భవనం వద్ద పూజలు చేశారు. అనంతరం తాసిల్దార్, ఎంఈవో, వ్యవసాయ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని కోనసీమగా తీర్చిదిద్దుతామన్నారు. తన తండ్రి నారాయణగౌడ్ కౌకుంట్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారని, అదే గ్రామం ఇప్పుడు మండలంగా ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో, మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో కౌకుంట్ల మండలంగా ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనీల్కుమార్, తాసిల్దార్లు జ్యోతి, శివరాజు, సువర్ణరాజు, ఎంపీడీవోలు శ్రీనివాసులు, శ్రీనివాస్రెడ్డి, డీఈవో రవీందర్, ఏడీఏ యశ్వంత్రావు, ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ఎంపీపీ సుజాత, సర్పంచ్ స్వప్న పాల్గొన్నారు.
కొత్తమండలాల ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి చెందడంతోపాటు ప్రభుత్వసేవలు ప్రజలకు చేరువవుతాయని ఎక్సైజ్,క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లాలో గుండుమాల్, కొత్తపల్లి నూతన మండలాలను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం, విద్యాశాఖ కార్యాలయం, ఏఈవో కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్టం సుభిక్షంగా ఉందన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పాలన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీచైర్పర్సన్ వనజ, కలెక్టర్ శ్రీహర్ష, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి, వెంకటయ్య, ఎంపీపీ మధుకర్రావ్, జెట్పీటీసీ ప్రకాశ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి పాల్గొన్నారు.