కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం కు వరద ఉధృతి నిలకడగా కొనసాగుతున్నది. శనివా రం 1,63,469 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. 30 గేట్లు ఎత్తి 1,49,784 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 95.086 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 1,44,844 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 1,44,300 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు కు 544 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 13.9 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. పులికల్ గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిపై నిర్మించిన నాగల్దిన్నె వంతెన వద్ద వరద పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
సుంకేసులలో..
సుంకేసుల బ్యారేజీకి 1,62,4 93 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో 27 గేట్లను 2 మీటర్లు ఎత్తి 1,61,988 క్యూసెక్కులు శ్రీశైలానికి వదిలారు. ప్రస్తుతం బ్యారేజీలో 0.438 టీఎంసీలు నిల్వ ఉన్నది.
నిండుకుండలా జూరాల..
ఎగువన కురుసున్న వర్షాలతోపాటు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల ప్రాజెక్టుకు 1.45 లక్షల క్యూసెక్కులు వస్తున్నది. దీంతో 23 గేట్లను ఎత్తి దిగువకు 1.56 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాగా, సెలవులు ఉండడంతో ప్రాజె క్టు అందాలు తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు.
కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద..
ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదికి వరద వచ్చి చేరుతున్నది. నదిలో ప్ర స్తుతం దాదాపుగా 2 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తున్నదని అధికారులు చెబుతున్నారు. బీచుపల్లి క్షేత్రంలో పుష్కరఘాట్ వద్ద నాలుగు అంచెల మెట్లను తాకుతూ వరదనీరు దిగువకు ప్రవహిస్తున్నది. వరద ప్రవాహవే గం ఎక్కువగా ఉండడంతో పుష్కరఘాట్ చెంత ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్త్, ప్రమాదసూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
ఎంజీకేల్ఐ రెండో లిఫ్ట్ ప్రారంభం..
మండలంలోని పస్పుల-ఖానాపూర్ శివారులోని జొన్నలబొగుడ రిజర్వాయర్ వద్ద ఉన్న రెండో లిఫ్ట్లో మోటార్ను ఎంజీకేఎల్ఐ అధికారులు శనివారం ప్రారంభించారు. మొదటి లిఫ్ట్ నుంచి సింగోటం రిజర్వాయర్ను నింపుతున్నారు. అందులో భాగంగా రెండో లిఫ్ట్ అయిన జొన్నలబొగుడ రిజర్వాయర్ నింపేందుకు ఒక మోటార్ ప్రారంభించినట్లు తెలిపారు. జొన్నలబొగుడ నింపిన తరువాత మూడో లిఫ్ట్ను ప్రారంభిస్తామన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు..
శ్రీశైలం జలాశయానికి శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి 1,16,409, విద్యుదుత్పత్తి నుంచి 35,959, సుంకేసుల నుంచి 1,61,988 (మొత్తం 3,14,356 క్యూసెక్కులు) విడుదలయ్యాయి. కాగా, శ్రీశైలం జలాశయంలోకి 2,68,715 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 853.70 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 88.4734 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది. టీఎస్ పవర్హౌస్లో విద్యుదుత్పత్తిని ప్రారంభించి 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.