ఇంటర్ ఫలితాల్లో బాలికలు ప్రభంజనం సృష్టించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరాల్లోనూ బాలికలు ముందు వరుసలో నిలిచారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,096 మంది బాలురు పరీక్ష రాయగా 2,029 మంది, 4921 మంది బాలికలు పరీక్ష రాయగా 3,508 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 4,342 మంది బాలురు పరీక్ష రాయగా, 2,472 మంది, బాలికల విభాగంలో 4,825 మంది పరీక్షకు హాజరుకాగా 3,579 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అన్ని గురుకుల సంక్షేమ పాఠశాలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రస్థాయిలోనూ సత్తాచాటడం విశేషం.
మహబూబ్నగర్ టౌన్, జూన్ 28 : ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరాల్లోనూ బాలికలు ముందు వరుసలో నిలిచారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు 4,096 మంది పరీక్ష రాయగా 2,029 మంది, బాలికలు 4921 మంది పరీక్ష రాయగా 3,508ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 9,017 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 5,537 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరంలో బాలురు 4,342 పరీక్ష రాయగా, 2,472 మంది, బాలికల విభాగంలో 4,825 పరీక్షకు హాజరుకాగా 3,579 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 9,167 మంది విద్యార్థులకుగానూ 6,051 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ మొదటి సంవత్సరంలో 1,482 మంది పరీక్షకు హాజరుకాగా 923 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 2,016 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,141 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 61శాతం, రెండో సంవత్సరంలో 66శాతం ఉత్తీర్ణతను సాధించారు. అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను తమ సొంతం చేసుకున్నారు.