మహబూబ్నగర్, జూన్ 25 : కరోనా కారణంగా రెం డేండ్ల కాల వ్యవధిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇ ల్లు గడిస్తే చాలూ అనుకునే రోజులు గడిచిపోయాయి. శ్రీనివాస్కాలనీలోని మైసమ్మ మహిళా సంఘం సభ్యులు సమి ష్టి ఆలోచనకు పదును పెట్టి లక్షలాది మా స్కులను కుట్టి దాదాపు 100 మంది మహి ళా సంఘం సభ్యులు ఉపాధి పొందారు. క రోనా కంటే ముందుగానే కుట్టు మిషన్లను అందుబాటులో ఉంచుకొని తోటి వారికి ఉ పాధి కల్పిస్తూ ఆర్గనైజర్ సౌదామిని అందరికీ ఆదర్శకంగా నిలుస్తున్నది. పని చేసే వా రు అందుబాటులో ఉన్నా ప్రస్తుతం వారు పనిలేక కొంత ఇబ్బందులకు గురవుతున్నా రు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల దుస్తులను కుట్టే అవకాశం తమకు అందిస్తే మం చిగా కుట్టి ఉపాధి పొందుతామని మైసమ్మ మహిళా సంఘం సభ్యులు “నమస్తే తెలంగాణ”కు తెలియజేశారు.
ఎంతో ఉపాధి లభిస్తున్నది
తమది మైసమ్మ మహిళా సంఘం. మేము అందరం 100 మంది వరకు ఉంటాం. కొందరు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కుట్టు మిషన్ల వద్దకు వచ్చి కుట్టడం, ఇతరుల బట్టలను తీసుకుపోయి ఇంటి వద్ద నుంచి కుట్టి ఇవ్వడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల దుస్తులు కుట్టించే అవకాశం కల్పిస్తే తమకు ఉపాధి ఇచ్చిన వారు అవుతుండ్రి.
-జయమ్మ, సంఘం ఉపాధ్యక్షురాలు
ఉన్నతాధికారులను కలిశాం
తమ వద్ద ఎంతో మంది మహిళలు బట్టలు కుట్టుకొని ఉపాధి పొందుతున్నారు. మైసమ్మ మహిళా సంఘం నుంచి దాదాపు 100 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే సంబంధింత అధికారులకు ఉపాధి కల్పించాలని వినతులు కూడా అందించాం. ఇతర జిల్లా ల నుంచి కొంత వరకు ఉపాధి వస్తున్నా మన జిల్లా నుంచి మాత్రం ప్రభు త్వ పాఠశాలల నుంచి దుస్తులు కుట్టించేసేందుకు అవకాశం రావడం లేదు. మాకు ఇప్పించి ఉపాధి పొందుతున్న వారికి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాం.
-సౌదామిని, ఆర్గనైజర్ మైసమ్మ మహిళా సంఘం