మహబూబ్నగర్, జూన్ 23 : మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కా ర్యాలయం నుంచి గురువారం అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెలాఖరులోగా పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో పనులు పూర్తి కావాలన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో ఇప్పటివరకు 68 పాఠశాలల్లో పనులను గ్రౌండింగ్ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో చేపట్టిన పనులకు సం బంధించిన ఫొటోలను గురువారం సాయంత్రంలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రాబోయే నాలుగురోజులపా టు పూర్తిస్థాయిలో పనులపైనే దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. టెం డర్ల ద్వారా చేపట్టాల్సిన పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో నిర్మిస్తున్న సంపుల విషయం లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు సంపుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి అయ్యేలా అధికారుల పర్యవేక్షణ ఉండాల ని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. వీసీలో డీఈవో ఉషారాణి, ఇంజినీరింగ్ అధికారులు, ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ఉన్నారు.