వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానిక యువతకు మాత్రమే 95శాతం ఉద్యోగాలు దక్కు తాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగాలు రావాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఆయన తెలిపారు. పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ, యువకులకు సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వనపర్తిలోని మంత్రి నివాసప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం ఆయ న మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గతంలో 20శాతం ఉద్యోగాల్లో ఓపెన్ క్యాటగిరీలో భర్తీచేసే వారని, అవే ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తే తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని భా వించి, వాటిని సవరించిన తర్వాత నే నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకే కొత్త జోన్లు, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఆల స్యం అయ్యాయన్నారు. ఆంధ్రోళ్లకు 20శాతం ఉద్యోగాలు దక్కాలనే నోటిఫికేషన్ల కోసం షర్మిలవంటి ఆం ధ్రానాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, యువత అటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. యువత ఉద్యోగ ప్రయత్నంలో ఎప్పు డూ నిరుత్సాహపడవద్దని, ఒకటి రాకుంటే మరో దానికోసం ప్రయత్నం చేయాలన్నారు.
కష్టపడి విజయం సాధించిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి జీవితాన్ని యువతీ, యువకులు ఆ దర్శంగా తీసుకోవాలని ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూను ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. యువత ఎస్సై, పోలీసు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను మంత్రి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు ఇచ్చిన వారికి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్పీ రంజన్త్రన్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, అడ్మిన్ డీఎస్పీ షాకీర్హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, సీఐలు ప్రవీణ్కుమార్, శ్రీనివాస్రెడి,్డ పీజేఆర్ కోచింగ్ సెంటర్ అడ్మిన్ జగదీశ్వర్రెడ్డి, యువతీ, యువకులు పాల్గొన్నారు.
‘వనపర్తి’ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుదాం
వనపర్తి, మే 20 : వనపర్తి జిల్లా కేంద్రాన్ని రోల్మోడల్గా తీర్చిదిద్దుకుందామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.5 కోట్లతో నిర్మించనున్న టౌన్హాల్ నిర్మాణానికి మంత్రి స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అభివృ ద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రాజనగరం అమ్మ చెరువు వద్ద జరుగుతున్న కట్ట పనులను మంత్రి పరిశీలించారు. కట్ట పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయడంతోపాటు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుమల మహేశ్, పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, కౌన్సిలర్లు పాకనాటి కృష్ణయ్య, లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.