భూత్పూర్, మే 20 : భూత్పూర్ మండల కేంద్రానికి జూన్ 4న మంత్రి కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామశివారులో నిర్వహించనున్న బహిరంగసభ స్థలాన్ని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో రూ.117కోట్లతో అభివృద్ధి పనులకు ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని, అలాగే సిద్దాయపల్లిలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారని చెప్పారు. దాదాపు 50వేల మందితో నిర్వహించే సభకు మంత్రులు వేములు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సభాస్థలిని పరిశీలించిన వారిలో మున్సిపల్ చైర్మన్ సత్తూ రు బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరెశేఖర్రెడ్డి, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, అజీజ్, జాకీర్ పాల్గొన్నారు.