భూత్పూర్, ఏప్రిల్ 25 : యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని పోతులమడుగులో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్ల కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంబించి తెలంగాణ రైతన్నకు అన్యాయం చేయాలని చూసిందన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, అరవింద్, మంత్రి కిషన్రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి పంట చేతికొచ్చాక చేతులెత్తేశారని విమర్శించారు. రైతన్నకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. రైతులు కొ నుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఏవో మురళీధర్, సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, సాయిలు, వెంకట్రాములు, రమేశ్చందర్, కరుణాకర్రెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరణ
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 25 : అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించనున్నట్లు ఎంపీపీ రమాదేవి అన్నారు. మండలంలోని డోకూర్, జీన్గురాల, గుడిబండ, కౌకుంట్ల గ్రామాల్లో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ యాసంగిలో పండిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నపూర్ణ, సర్పంచ్ స్వప్న, వైస్ఎంపీపీ సుజాత, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, డైరెక్టర్ కృష్ణగోపాల్, సీఈవో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, ఏఈవో శ్రీనివాసులు, కార్యదర్శి చంద్రశేఖర్, కిషన్రావు, శంకర్, సత్యన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.