గద్వాల టౌన్, డిసెంబర్ 15 : శ్రావణ మాసం.. మాఘ మాసం.. కా ర్తీక మాసంతోపాటు హైందవ సంస్కృతిలో ధ నుర్మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ మాసాంతం భక్తులు మహావిష్ణువును కొ లుస్తారు. దీంతో ప్రతి వైష్ణవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ధనుర్మాసంలో నిత్యం ఉదయం, సాయంత్రం దీపారాధ న చేస్తే మహాలక్ష్మి కరుణాకటాక్షాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్న ధనుర్మాసం (మార్గశిర మాసం) సంక్రాంతి కంటే నెల ముందు ప్రారంభమవుతుంది. శుక్రవారం నుంచి జనవరి 16 వరకు ధనురాస్మం ఉంటుంది. దీనినే సంక్రాంతి నెల అంటారు.
ధనురాశిలోకి సూర్యుడు ప్ర వేశించిన సమయం ధనుసంక్రమణం. ధనుస్సులో సూర్యుడుండే కాలాన్నే ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం మొ త్తం ఆధ్యాత్మికతతో ముడిప డి ఉంటుంది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించినదే. అందుకే తిరుప్పా వై పఠనం, గోదాదేవి కల్యాణం, ఆండాళమ్మ పూజలు ఈ మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో సుప్రభాతం బదులు తి రుప్పావై పాడతారంటే ఈ మాసానికి ఎంత ప విత్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాల్లో స్థానిక ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాలు కలిసిన అం శాల్లో ధనుర్మాసం ఒకటి. మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్ఠమైనది. మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది అని అర్థం. మా ర్గం అనగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. కార్తికేయుడు, కాలబైరవుడు, దత్తాత్రేయుడుతోపాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే. మార్గశిర మాసం శ్రీకృష్ణతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని, నారాయణుడిని తులసీదళాలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.
శుక్రవారం నుంచి ధనుర్మాసం ప్రారంభంకానుండడంతో వైష్ణవాలయాలు ముస్తాబవుతున్నాయి. నెల రోజులపాటు మహావిష్ణువుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహావిష్ణువు అవతారాలైన నృసింహస్వామి, వేణుగోపాలస్వామి, రంగనాథస్వామి తదితర ఆలయాల్లో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. గద్వాల కోటలోని భూలక్ష్మీచెన్నకేశవ అలయం, బుర్ధాపేటలోని రంగనాథస్వామి ఆలయం, గంజిపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద అగ్రహారంలోని లక్ష్మీనృసింహస్వామి, భీంనగర్లోని సంతాన వేణుగోపాలస్వామి, నది అగ్రహారంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నాయి.