మానవపాడు, నవంబర్ 29: ఆయిల్పాం సాగు లాభదాయకమని, రైతులు దృష్టి సారించాలని విదేశీ శాస్త్రవేత్తలు ఫ్రాన్స్కు చెందిన నికోలస్, థాయిలాండ్కు చెం దిన సిల్వాయిన్, మలేషియాకు చెందిన సరూట్ సూ చించారు. మంగళవారం మండలంలోని చండూరు శి వారులో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కూ తుళ్లు అమృతవర్షిని, ప్రత్యూష వ్యవసాయక్షేత్రంలోని 70ఎకరాల్లో సాగుచేసిన ఆయిల్పాం తోటను సందర్శించారు. తోటలో అంతరపంటగా సాగైన శనగ పం టను పరిశీలించి మాట్లాడారు. సామ్ ఎలైట్ కంపెనీ విత్తనాలు అందించగా.. నర్సరీల్లో మొక్కలను పెంచి పొలాల్లో నాటారని తెలిపారు. ఈ కంపెనీ మొక్కలు తక్కువ ఎత్తులో పెరిగి ఎక్కువ దిగుబడి ఇస్తాయన్నా రు. నాటిన ఏడాదిలోనే మొక్కలు ఇంత పెరగడం ఇక్కడే చూస్తున్నామన్నారు. భవిష్యత్లో ఆయిల్పాంకు డిమాండ్ ఉంటుందన్నారు. తోటల సాగుకు ఎన్నో రాయితీలను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, మిగతా రైతులకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ సాకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు క్షేత్ర స్థాయిలో ఆసక్తి ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాధారంగా కాకుండా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ తోటల సాగు బాగుంటుందన్నారు. అంతర్ పంటలు కూడా సాగు చేసే అవకాశం ఉన్నదన్నారు. ఈ క్షేత్రంలో మొక్కల పెరుగుదలను చూసి చుట్టుపక్కల గ్రామాల రైతులు తోటల సాగుకు ముందుకు రావడం ఆనందంగా ఉన్నదని ఆయిల్పాం మొక్కలు అందించిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వారి వెంట వైఎస్ రంగనాయకులు, సలహాదారు మధుసూదన్రెడ్డి, రైతులు ఉన్నారు.