భూత్పూర్, నవంబర్ 25 : టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వలసలు పెరిగాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ ఇంట్లో ఎమ్మెల్యే ఆల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గు లాబీ కండువాలు కప్పారు. పార్టీలో చేరిన వారిలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్రెడ్డి, బీజేవైఎం మండలాధ్యక్షుడు జైపాల్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బాల్చెన్నయ్య, బీజేపీ నాయకులు రామస్వామిగౌడ్, నరేందర్గౌడ్, బచ్చన్న, రామచంద్ర య్య, నాగరాజు, దొబ్బలి యాదయ్యతోపాటు మరో 20 మంది ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, అశోక్గౌడ్, రాములు, సురేశ్గౌడ్, నర్సింహులు, ప్రేమ్కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.