నారాయణపేట, నవంబర్ 21: ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చే సిన ప్రజావాణిలో మొత్తం 15 అర్జీలు వచ్చాయి. బాధితులతో నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మయాంక్మిట్టల్, పద్మజారాణి, ఏవో నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ కార్యాలయంలో..
బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించడం ద్వారా సరైన న్యాయం చేయాలని డీ ఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని తన కా ర్యాలయంలో ఆయన ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించా రు. మొత్తం 6 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు భద్రత, భరోసా కల్పించేలా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు సూచించారు.
బోధనను మెరుగుపర్చుకోవాలి
నారాయణపేట టౌన్,నవంబర్ 21: ఉపాధ్యాయులు భోదనను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందుని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. సోమవారం పట్టణంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఉపాధ్యాయులు తమ సమయాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్ణయించుకోవాలని, విద్యార్థులను ఆకట్టుకునేలా బోధన చేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టులో ఉపాధ్యాయులు లీనం కావాలని, లేకుంటే విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలు రావన్నారు. రానున్న 40 రోజుల్లో ప్రతి విద్యార్థి ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలు సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యావిషయక ప్రగతికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈవో గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.