మహబూబ్నగర్, జనవరి 4 : రైతులను ప్రభు త్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనతి కాలంలోనే టీఆర్ఎస్ సర్కార్ ఎంతో అభివృద్ధి చేసి చూపించిందన్నారు. జిల్లాలో 2,09,607 మంది రైతులకు రూ.228.20 కోట్లు రైతుబంధు సాయం అందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, డీఏవో సుచరిత, అధికారులు పాల్గొన్నారు.
పెట్టుబడి కష్టాలు తీర్చిన ‘రైతుబంధు’..
అన్నదాతలకు రైతుబంధుతో పంట పెట్టుబడి కష్టాలు తీరాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మండలంలోని వీరాపురం గ్రామంలో నిర్వహించిన రైతుబం ధు ఉత్సవాల్లో భాగంగా ఎంపీ రాములు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుబంధు పథకం దేశంలోనే గొప్పది అని అన్నారు. రైతును రాజు చేయడమే ల క్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీ ప్ర తాప్ గౌడ్ మంత్రి, ఎంపీని సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజ, డీసీఎంఎస్ డైరెక్టర్ సుభాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ విజయ్ కుమార్, జెడ్పీటీసీ రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి గౌడ్, మహేశ్, మురళి, శ్రీను, కృష్ణ, శ్రీమన్నారాయణ, సర్పంచ్ స్వప్న, నాయకులు రమేశ్నాయుడు, రామన్ గౌడ్, తిమ్మారెడ్డి, వెంకట్రాములు, కురుమన్న, కోటేశ్, నాగులుయాదవ్, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, నీలేశ్వర్రెడ్డి, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.