కోస్గి, అక్టోబర్ 9 : భువనగిరి జి ల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా కొడంగల్ ఎ మ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదివా రం స్థానిక నాయకులతో కలిసి ప్ర చారం చేశారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను గ్రామస్తులందరికీ వివరించాలన్నారు. విషయాన్ని ప్రత్యేకంగా ఓటర్లకు తెలియజెప్పాలని సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, పార్టీ నాయకులు అం దరూ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్ర జలతో మమేకమై రాష్ట్రంలో అమలవుతున్న సం క్షేమ పథకాలు, వాటి లబ్ధిని, అభివృద్ధిని వివరించారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టా ల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పథకాల కో తలతో ఇబ్బందులను వివరించారు. కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజలు ఆ లోచించి ఓటు వేయాలన్నారు. జాతీయ స్థాయి లో దేశమంతా కేసీఆర్వైపు చూస్తుందన్నారు. కా ర్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రా మకృష్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్చైర్మన్ వేణుగోపాల్, నాయకులు, కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు.