మహ్మదాబాద్, ఆగస్టు 9 : మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం తో చాలీచాలని భోజనంతో కడుపు మాడ్చుకుంటున్నారు. వార్డెన్ను ఏదైనా అడిగేందుకు వెళ్తే బెదిరింపులకు గురి చేయడంతోపాటు దుర్భాషలాడుతూ.. చేయి కూడా చేసుకుంటున్నాడని విద్యార్థు లు ఆరోపించారు. కిలో మంచి నూనె ప్యాకెట్ ఇచ్చి నాలుగు రోజులు సరిపెట్టాలని, కారం పొడికి బదులు పచ్చికాయలు వాడాలని.. తక్కువ మొత్తంలో పప్పు ఇచ్చి నాలుగు రోజులు సరిపెట్టాలని వంట వండే వారికి వార్డెన్ సూచిస్తున్నాడని ఆరోపించారు. దీంతో ఉన్నదాంట్లో వంట చేస్తే సరిపోకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం నాకు ఇంతే ఇస్తుంది.. సరిపోకుంటే మీ ఇంటి నుంచి తెచ్చి విద్యార్థులకు వంట చేసి పెట్టాలని బెదిరిస్తుండడంతో చేసేది లేక ఉన్నదాంట్లోనే సరిపెట్టే ప్రయత్న చేస్తున్న ట్లు వంటవారు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్ర కారం ఇవ్వాల్సిన గుడ్లు, పండ్లల్లో కోత విధిస్తున్నట్లు ఎవరికైనా చెబితే మీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సాయంత్రం స్నాక్స్ ఇ వ్వాల్సి ఉండగా.. వేడి నీళ్లల్లో సేమియా, చక్కెర కలి పి ఇస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. హాస్టల్లో క రెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళితే.. మీ ఇండ్లల్లో దీపాలకే దిక్కులేకుంటది.. ఉన్న దాంట్లో సర్దుకోండని గద్దిస్తున్నాడని పలువురు విద్యార్థులు వాపోయారు. అ యితే ఆదివారం గ్యాస్ సిలిండర్ అయిపోతే వర్కర్లు వార్డెన్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. కొత్తది పెట్టి వారం కూడా కాలేదు.. అప్పుడే సిలిండర్ అయిపోవడమేమిటని.. కట్టెలు తీసుకొచ్చి వంట చేయాలని ఉచిత సలహా ఇచ్చాడని తెలిసింది. దీంతో చేసేది లేక 13 మంది విద్యార్థులను హాస్టల్ సమీపంలోని హో టల్ వద్దకు వర్కర్ తీసుకెళ్లి సొంత డబ్బుతో భోజనం చేయించారు. ఈ విషయం తెలిసి వార్డెన్, అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు స్మార్ట్ఫోన్ ఉండడంతో హాస్టల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం వారిని అడిగి తెలుసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి వార్డెన్ గురించి ఆరా తీస్తే ఇప్పుడే వచ్చి వెళ్లారని విద్యార్థులతో చెప్పిస్తున్నట్లు సమాచారం.
ఆకలితో ఉంచలేకే హోటల్లో తినిపించాం..
విద్యార్థుల ఆకలి సమస్యలపై వార్డెన్ను వివరణ కోరగా ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపెడితే ఎలా అన్నారు. హాస్టల్లో సిలిండర్ అయిపోవడం.. ఆదివారం కావడంతో గ్యాస్ రాలేదు. అందుకే విద్యార్థులను పస్తులు ఉంచొద్దనే హోటల్లో తినిపించాలని వర్కర్కు సూచించానని చెప్పారు.
విచారణ జరిపిస్తాం..
విద్యార్థులు బయటి ఆహా రం తినడానికి అనుమతి లేద ని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య తెలిపా రు. అలా తినిపించారని నిర్ధారణ అయితే చర్య లు తప్పవన్నారు. విద్యార్థులకు ఏ లోటు వచ్చినా తమ దృష్టికి తీ సుకొస్తే చ ర్యలు తీసుకుంటామన్నా రు.