గద్వాల, ఆగస్టు 11: స్వాంతత్య్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను స్మరించుకుని చరిత్రలో నిలిచిపోయే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో వజ్రోత్సవాల సందర్భంగా గురువారం ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష, మున్సిపల్ చైర్మన్ కేశవ్, డీఎస్పీ రంగస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడారు.
కులమతాలకతీతంగా వజ్రోత్సవాలు నిర్వహించడం వల్ల దేశ సమైక్యత పెంపొందిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశం గర్వించే విధంగా 75వ వజ్రోత్సవాలలో మనం పాల్గొనడం మన అదృష్టమని చెప్పారు. ఫ్రీడమ్ రన్ పాతబస్టాండ్ నుంచి రాజీవ్మార్గ్ మీదుగా కొనసాగింది. అనంతరం అక్కడ శాంతి పావురాలు ఎగురవేసి వజ్రోత్సవాలపై వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, సీఐ చంద్రశేఖర్, ఉపాధ్యాయిలు, విద్యార్థులు పాల్గొన్నారు.
గద్వాల రూరల్, ఆగస్టు 11: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని వీరాపురంలో ఎపీపీ ప్రతాప్గౌడ్ ఆధ్వర్యంలో గురువారం 2కే రన్ ప్రారంభించారు. కార్యక్రమంలో మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో మొదటి, రెండో బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, ఎంపీడీవో రవీంద్ర, రూరల్ ఎస్సై ఆనంద్, టీఆర్ఎస్ నాయకులు రమేశ్నాయుడు, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్, ఆగస్టు 11: మల్దకల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై శేఖర్ అధ్యక్షతన గురువారం 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచ్ యాకోబు హాజరయ్యారు. ఫ్రీడమ్ రన్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు నుంచి కుర్తిరావుల చెర్వు గ్రామ సమీపం వరకు నిర్వహిచడం హర్షించదగ్గ విషయమని ఎంపీపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ హరికృష్ణ, వైస్ ఎంపీపీ పెద్దవీరన్న, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటన్న, సర్పంచులు శివరామిరెడ్డి, వీరేశ్నాయక్, జయమ్మ, అంజి, ప్రతాప్, ఎంపీటీసీ పెద్దగోపాల్రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ధరూరు, ఆగస్టు 11: వజ్రోత్సవాల్లో భాగంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్సార్ చౌరస్తాలో 2కే రన్ను జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్రెడ్డి జెండాఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నిసాబేగం, సర్పంచ్ పద్మమ్మ, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో అబ్దుల్జబ్బార్, ఎస్సై శేఖర్రెడ్డి, హాస్టల్ వార్డెన్ నర్సింహులు, ఎంపీవో కృష్ణమోహన్, ఆర్ఐ లతీఫ్, నరేశ్, టీఆర్ఎస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
గట్టు, ఆగస్టు 11: గట్టు ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో పెట్రోలు బంక్ నుంచి గంగిమాన్దొడ్డి వరకు నిర్వహించిన రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీల నాయకులు, గురుకుల, కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం 2కే రన్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, తాసిల్దార్ రమేశ్, ఎంపీడీవో చెన్నయ్య, డీటీ రవికుమార్, కేజీబీవీ ఎస్వో గుంటి గోపిలత పాల్గొన్నారు.
గద్వాలటౌన్, ఆగస్టు 11: ప్రతిఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేలా కార్యక్రమాలు ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. మున్సిపాలిటీలోని 27వ వార్డులో చేపట్టిన జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మురళి, మహేశ్ నాయకులు పాల్గొన్నారు.
ధరూరు, ఆగస్టు 11: అలంపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు గురువారం 2కే రన్, వకృత్వ పోటీలు నిర్వహించారు.గుడ్డెందొడ్డి క్వార్టర్స్లో నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యార్థులు ఫ్రీడమ్ రన్లో పాల్గొని, స్వతంత్ర పోరాట నాయకులు, ఘట్టాలపై నిర్వహిచించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటారు. విజేతలకు ప్రిన్సిపాల్ సురేఖ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అలంపూర్, ఆగస్టు 11: మండలంలోని ఊట్కూరులో సర్పంచ్ అయ్యస్వామి గురువారం పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
అలంపూర్, ఆగస్టు 11: వజ్రోత్సవాల్లో భాగంగా ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్లో ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. బాలబ్రహ్మేశ్వరాలయం నుంచి మాంటిస్సోరి పాఠశాల వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.
ఉండవెల్లి, ఆగస్టు 11: అలంపూర్ చౌరస్తాలో ఉండవెల్లి ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అబ్రహం హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఫ్రీడమ్ రన్లో 700మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ వీరభద్రప్ప, ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.
అయిజ, ఆగస్టు 11: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో ఎమ్మెల్యే అబ్రహం గురువారం 2కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శాంతినగర్ సీఐ శివశంకర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ దేవన్న, వైస్ చైర్మన్ నర్సింహులు, విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ తాహేర్, అధికారులు, నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి, ఆగస్టు 11: శాంతినగర్లో ఎస్సై శ్రీనివాస్నాయక్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. పట్టణ నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో వైస్చైర్పర్సన్ సుజాత, నాయకులు వడ్డేపల్లి సూరి పాల్గొన్నారు.
ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 11: ఇటిక్యాల మండల కేంద్రంలో సీఐ సూర్యనాయక్, ఎంపీపీ స్నేహరెడ్డి ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.
రాజోళి, ఆగస్టు 11: మండల కేంద్రంలో ఎస్సై లెనిన్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మానవపాడు, ఆగస్టు 11: మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్లో ఎస్సై సంతోష్, తాసిల్దార్ నరేశ్, ఎంపీడీవో రమణారావు ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. మండలంలోని అమరవాయి నుంచి మానవపాడు పెట్రోల్ బంకు వరకు 2కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు 500 మంది రన్లో పాల్గొన్నారు.