నారాయణపేట రూరల్, సెప్టెంబర్14: పేట జిల్లా కేంద్రంలోని హిందీ ప్రచార్సమితి కార్యాలయంలో హిందీ దివస్ను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం జాతీయపతాకావిష్కరణ చేశారు. హిందీ భాష వ్యాప్తికి ప్రతిజ్ఞ చేశారు. హిందీ భాష ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా నేటి నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు 10వ తరగతి విద్యార్థులకు హిందీ భాషాకి మహత్వ్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, ఇంటర్ విద్యార్థులకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్-దేశ్కా వికాస్, డిగ్రీ విద్యార్థులకు సూచనా ప్రాద్యోగికి ఔర్భారతీయ భాష అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.
6వ, 7వ తరగతుల వారికి షయీద్ రాంప్రసాద్బిస్మిల్ చిత్రానికి చిత్రలేఖనం, మధ్యాహ్నం 2 గంటలకు ఉపన్యాసం 10వ తరగతి విద్యార్థులకు ప్లాస్టిక్ పర్ ప్రతిబంధ్, ఇంటర్కు స్వతంత్ర సంగ్రామ్ మే హిందీకి భూమికా, డిగ్రీకి సంయుక్త్ రాష్ట్రసంఘ్మే హిందీ అధికారిక్భాష సంభావనాయే అనే అంశాలు, శుక్రవారం ఉదయం 10 గంటలకు క్విజ్, మ ధ్యాహ్నం 2 గంటలకు హిందీ పదాల డిక్టేషన్, హిందీ పాట ల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు అధి క సంఖ్యలో హాజరు కావాలని సమితి సభ్యులు కోరారు. కార్యక్రమంలో సమితి సభ్యులు అంబర్నాథ్కాంబ్లే, సుఖ్దేవ్, విఠల్రావు, నారాయణరావు, సత్యనారాయణ, విశ్వనాథ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్, సెప్టెంబర్14: మక్తల్ పట్టణంలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ భాషా ప్రాముఖ్యతపై ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసినట్లు క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అంబాదాస్ తెలిపారు.
ఈ సందర్బంగా అంబాదాస్ మాట్లాడుతూ హిందీ భాషా ప్రాముఖ్యతను తెలుపుతూ పట్టణంలోని హిందీ ఉపాధ్యాయులు విభీషణ్, సుధీర్, విజయలక్ష్మి, శాంతాబాయి, లక్ష్మి, రహమ త్, నర్సింహ, ఆనంద్, వెంకటేశ్, బాలకృష్ణ, రూప, అమృత, శ్రీకాంత్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ డీవీ చారి, అడ్మినిస్ట్రేటర్ అక్కల సత్యనారాయణ, కట్టా వెంకటేశ్, అంజన్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, సెప్టెంబర్ 14: జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నపొర్ల, పెద్దజట్రం జెడ్పీహెచ్ఎస్లో హిందీ ఉపాధ్యాయులను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈసందర్భంగా హెచ్ఎం వెంకట్రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలకు నిలయమని దేశాన్ని ఏకం చేసే గుణం భాషకు మాత్రమే ఉందన్నారు.
భాష అంటే కేవలం మనుషుల మధ్య భావం మాత్రమే కాదని, మనుషుల మధ్య దృఢమైన బంధమన్నారు. భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు హిందీ అక్షరమాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహ, భాస్కర్, శ్రీకాంత్, శంకర్, సీతారాములు, బసవరాజ్ పాల్గొన్నారు.
మద్దూర్, సెప్టెంబర్ 14:మండలంలోని రెనివట్ల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హిందీ భాషలో దేశభక్తి గీతాలు, కవితలు దోహాలు ఆలపించారు. ఈ సందర్భంగా హిందీ భాషోపాధ్యాయులు, భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ మాట్లాడుతూ మన దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషా హిందీ అని 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యంగ సభ ఏకగ్రీవంగా హిందీని జాతీయ భాషగా గుర్తించిందని 1953 నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరపుకుంటామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాషా, విజయశాంతి, రాములు, అనంతయ్య, రాజేశ్ తదితరులు ఉన్నారు.