ఊట్కూర్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఊట్కూర్, బిజ్వా రం, పెద్దపొర్ల, పులిమామిడి గ్రామాల్లో యువతీ యువకులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆయా గ్రామాల్లో యోగా మాస్టర్లు యోగా ప్రాముఖ్యతను వివరించి మెళకువలు నేర్పించారు. ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ కేశవరావు మాట్లాడుతూ యోగాతో మానసిక ఉల్లాసం, శరీర దృఢ త్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ విధిగా యోగాను అలవాటూ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రమేశ్, ఎంపీటీసీ హన్మం తు, వీహెచ్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పిల్లిగుండ్ల తండాలో..
నారాయణపేట రూరల్, జూన్ 21 : ప్రపంచ యోగా ది నోత్సవాన్ని సోమవారం మండలంలోని పిల్లిగుండ్ల తండా గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. యోగా విసిష్టిత, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ కార్యదర్శి జ్యోతి వివరించారు. యోగా ద్వారా మనస్సు ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధు చౌహాన్, చంద్రశేఖర్, విజయ్ పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, జూన్ 21 : మండలంలోని పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణల్లో యోగా డేను ఘ నంగా నిర్వహించారు. మండలంలో సంజీవరాయ ఆలయ ఆవరణలో పతంజలి యోగా సమితి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వాహకులు ఎం.అశోక్ యోగాసనాలు వేయించి వాటి ఉపయోగం గురించి వివరించారు. ఎంపీపీ కార్యాలయంలో యోగాడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, మాజీ సర్పంచ్ రవీంద్రనాథ్, డాక్టర్ వెంకట్రాములు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రకృతికి అనుకూలంగా మారాలి
ప్రతిఒక్కరూ ఆహారంలో మార్పులు చేసుకుంటూ ప్రకృతికి అనుకూలంగా మారాలని డీఎంహెచ్వో డాక్టర్ జయచంద్రమోహన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ అన్నారు. సోమవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో సామూహిక యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు సురేశ్, భారత్ స్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షుడు రాజేంద్రలాహోటి, రమణ, శివకుమార్, విజయలక్ష్మి, రాణి లాహోటి, మహేశ్వరీ, ప్రవీణ్కుమార్, రాజు పాల్గొన్నారు.
వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో..
యోగా మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని మక్తల్ వాకర్స్ క్లబ్ సభ్యులు అన్నారు. సోమవారం పట్టణంలోని రాయచూర్ రోడ్డు మధురానగర్ కాలనీలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో మక్తల్ వాకర్స్ క్లబ్ సభ్యులు విద్యాసాగర్, శేఖర్, శ్రీదర్, తిరుపతి, గురు, గోవింద్, శ్రీనివాస్, రేణుక, నర్సింహ, కావలి శ్రీహరి, భుట్టో, సాయిలు, వాకిటి క్రిష్ణ, హీరోజీ, కాంతు, థాన్సింగ్, నర్సింహరెడ్డి, రమేశ్, నర్సింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.