కరోనా లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి
జిల్లా దవాఖానలో 600 పడకలతో నూతన భవనం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ దవాఖానలో అధునాతన హైప్లో నాజల్ కానుల్ ప్రారంభం
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 10: ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనాపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి మందులు వాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ఎన్ఆర్ఐ, ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన రూ.8లక్షల హైప్లో నాజల్ కానుల్ అధునాతన పరికరాలను దవాఖానకు ఉచితంగా అందజేయగా మంత్రి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా దవాఖానలో ఉన్న పడకలను అదనంగా 600పడకలతో కొత్త దవాఖాన నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ఆంగీకరించారన్నారు. జిల్లాలో ప్రైవేట్ దవాఖానలు కూడా 24గంటలు పనిచేస్తున్నాయని చెప్పారు. వారం రోజుల్లో మరో 250పడకలను ఆక్సిజన్తో సహా సిద్దం చేయనున్నామన్నారు. జిల్లా దవాఖానలో చికిత్స పొందిన కరోనా బాధితులు చికిత్సపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఆక్సిజన్, రెమ్డెసివిర్ టీకా, మందులు అందుబాటులో ఉంచామని, ఆర్టీపీసీఆర్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఇంటికే సంచార అంబులెన్స్ క్లినిక్లను పంపిస్తామని, డాక్టర్లు వైద్యసేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాంకిషన్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, వైద్యులు శామ్యూల్, సంపత్, విజయ్కాంత్, సునీల్, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, దవాఖాన కమిటీ సభ్యులు వెంకట్రాములు, మల్లేశ్, కౌన్సిలర్లు రామ్లక్ష్మణ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
బాధితుల బాధ్యత సర్పంచులదే..
హన్వాడ, మే 10: కరోనా నుంచి బాధితులను కాపాడాల్సిన బాధ్యత సర్పంచులదేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఓపెన్ జిమ్, స్లాటర్హౌస్ నిర్మాణాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఓపెన్ జిమ్ నిర్మాణానికి రూ.25లక్షలు, రూరల్ స్లాటర్హౌస్కు రూ.కోటీ 20లక్షలు మంజూరు చేశామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో కరోనా కేసు లు పెరుగడంతో బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీతోపాటు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కొవిడ్ లక్షణా లు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. మండలానికి వాట్సా ప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవరికైనా లక్షణాలు ఉంటే వారు కాల్చేసిన వెంటనే కావాల్సిన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సేవా సహకార సంఘం బ్యాంకు ఎదుట అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన డబ్బాలను తొలంగించాలని గ్రామ కార్యదర్శి వెంకటయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ రేవతి, విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీపీ బాలరాజు, వైస్ఎంపీపీ లక్ష్మి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఏవో కిరణ్కుమార్ పాల్గొన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే..
గండీడ్, మే 10: పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త మండలాలను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహ్మదాబాద్ మండల కేంద్రం భవన సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను సోమవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, పంచాయతీలు, మండలాలు ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కొత్త మండలంలో కొన్ని రోజులపాటు సిబ్బంది కొరత ఉంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి నియోకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాడన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో గండీడ్ మండలంలోని మహ్మదాబాద్, కుల్కచర్ల మండలంలోని చౌడాపూర్ను మండలాలుగా ఏర్పాటు చేయడంతో ముప్పైఏండ్ల కల నెరవేరిందని అన్నారు. మండలం కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీవో పద్మశ్రీ, తాసిల్దార్ జ్యోతి, వరప్రసాద్, ఎంపీడీవో రూపేందర్రెడ్డి, ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతు బం ధు సమితి అధ్యక్షుడు గిరిధర్రెడ్డి, సర్పంచ్ పార్వతమ్మ, ఎంపీటీసీ చెన్నయ్య, కోఆప్షన్ సభ్యుడు సలీం, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు రాంరెడ్డి, గోపాల్రెడ్డి, కేశవులు, బాలవర్ధన్రెడ్డి, రమేశ్రెడ్డి, భిక్షపతి, అశోక్గౌడ్, గోపాల్, మోహన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు