కొల్లాపూర్ రూరల్, జూన్ 29 : కల్వకుర్తి నుంచి మల్లేశ్వరం వరకు జాతీయ రహదారి-167కే నిర్మాణానికి ప్రభు త్వం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ప్యాకేజీ-1లో బైపాస్ రోడ్డుకోసం భూసేకరణకు రైతులు, ప్లాట్ల యజమానులు సహకరించాలని భూసేకరణాధికారి, ఆర్డీవో హనుమానాయక్ కోరారు. బుధవారం కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం లో జాతీయ రహదారుల అధికారులు, మండల సర్వేయర్లతో ఆర్డీవో సమావే శం నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కొల్లాపూర్ డివిజన్కు సంబంధించి చం ద్రకల్ గ్రామం నుంచి మల్లేశ్వరం వరకు ప్యాకేజీ -1 ద్వారా రోడ్డు నిర్మాణం చే యబడుతుందన్నారు.
అందులో భాగం గా సింగోటం చౌరస్తా, బొంగురాల మి ట్ట నుంచి వరిద్యాల శివారు (సర్వే నం బర్ 100)వరకు 150 ఫీట్ల వెడల్పులో 4.6 కిలోమీటర్ల మేర బైపాస్రోడ్డు ని ర్మాణం చేస్తున్నారు. ఇందుకు కావాల్సి న భూమిని సేకరించేందుకుగానూ గ తంలో మార్కు చేసిన ప్రకారంగా ఈ నెల 30నుంచి వచ్చే నెల 2 వరకు సర్వే చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత రై తులు, ప్లాట్ల యజమానులు అధికారుల కు సహకరించాలని కోరారు. సమావేశం లో జాతీయ రహదారి అధికారులు నితిన్కుమార్, మేనేజర్ రాధాకృష్ణ, నాగిరె డ్డి, సర్వేయర్లు శివ, రాములు ఉన్నారు.