మహబూబ్నగర్టౌన్, జూన్ 29 : పాలిటెక్నిక్-2022 ప్రవేశ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం నిర్వహించనున్న పరీక్షకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల,బాలికల జూనియర్, డైట్, బీఈడీ కళాశాల, మోడ్రన్ హైస్కూల్, గాంధీరోడ్డు స్కూల్, స్విట్స్ కళాశాలల్లో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,525మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 11నుంచి మధ్యా హ్నం 1:30 గంటలవరకు పరీక్ష ఉంటుంది. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఇవ్వరు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను బుధవారం జిల్లా కోఆర్డినేటర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు పరిశీలించారు. విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు.