మహబూబ్నగర్ : జిల్లాలో రేపటి నంచి (సోమవారం) ప్రత్యక్ష ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. కరోనా కట్టడిలోనే ఉన్న నేపథ్యంలో ఇకపై నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 31(సోమవారం ) నుంచే ప్రజావాణి కార్యక్రమం గతంలో మాదిరిగా రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రత్యక్షంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులందరు ఉదయం 10 గంటలకే హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశించారు. ఫిర్యాదుదారులు కూడా వారి ఫిర్యాదులను నేరుగా ప్రజావాణిలో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.