ఖిల్లాఘణపురం, జనవరి 24 : ఆవుదూడలపై చి రుత పులి దాడి చేసి చంపేసిన ఘటన మండలంలో ని మానాజీపేట, షాపూర్ గ్రామాల్లో బుధవారం చో టుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. కొద్ది రో జులుగా గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తుండ గా..
బుధవారం ఆవుదూడపై దాడిచేసి చంపివేసింద ని చెప్పారు. చిరుతపులి సంచారంతో ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకొని జీవిస్తున్నామని, అటవీశాఖ అధికారులు దానిని బంధించి రక్షణ కల్పించాలని కోరారు.