మహబూబ్నగర్, డిసెంబర్ 13 : భూసేకరణకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడా రు. కోయిల్సాగర్ ప్రాజెక్టు వద్ద భూసేకరణ సమస్యలు పరిష్కరించాలన్నారు. అలాగే జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ కె నాల్స్, ఇతర పనుల సమస్యలు కూడా పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
అభ్యంతరాలను పరిశీలించాలి
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ వెంకట్రా వు అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో రాజకీయపార్టీల నేతల సమావేశంలో పలు విషయాల ను చర్చించి మాట్లాడారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధిం చి వచ్చిన అభ్యంతరాల పరిష్కారంపై కూడా దృష్టి కేంద్రీకరించాలన్నారు. ధరణికి సంబంధించిన అన్ని మాడ్యుల్స్లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఈనెల 18న కేం ద్ర ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ సంచాలకులు జిల్లా సందర్శన సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల నివేధిక లు, ఇతర నివేధికలను వెంటనే తనకు సమర్పించాలన్నా రు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆయా ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులు, తాసిల్దార్లు తదిత రులు పాల్గొన్నారు.
సహకరించాలి
మహబూబ్నగర్ పట్టణంలో రహమానియా బ్రిడ్జి వద్ద రోడ్డు పనులు చే యడంతో ట్రాఫిక్ మళ్లించినట్లు కలెక్ట ర్ వెంకట్రావు మంగళవారం ప్రకటన లో పేర్కొన్నారు. హన్వాడ నుంచి వన్టౌన్, రాయిచూర్ వైపు వచ్చే భారీ వాహనాలు బస్సులు, ఎస్వీస్, పాలకొండ బైపాస్రోడ్డు మీదుగా వన్టౌన్ పోలీస్స్టేషన్ మీదుగా వెళ్లాలని సూ చించారు. రాయిచూర్ నుంచి మహబూబ్నగర్ బస్టాండ్కు వచ్చే వాహనాలు వన్టౌన్, భూత్పూర్ రహదారిపై పాలకొండ బైపాస్ రోడ్డుమీదుగా ఎస్వీఎస్ దవాఖాన నుంచి బస్టాండ్కు చేరుకోవాలని సూచించారు. భారీ వాహనదారులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ తెలిపారు. రహమానియా బ్రిడ్జి వద్ద రహదారి పనులు జరుగుతున్న దృష్ట్యా పట్టణంలోని ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని తెలిపారు. ముఖ్యంగా లారీలు, బస్సులు, బారీ వాహనాలు ఈ నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు.
రెడ్క్రాస్ సేవలకు ప్రత్యేక గుర్తింపు
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు, కరోనా సమయంలో విస్తృత సేవలు చేసినందుకుగానూ ప్రత్యేక గు ర్తింపు లభించిందని రెడ్క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అ న్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి మహబూబ్నగర్ రెడ్క్రాస్ 18గోల్డ్మెడల్స్తోపాటు 4 సే వా మెడల్స్ మొత్తం 22అవార్డులు ప్రకటించినట్లు తెలిపా రు. ఇందుకుగానూ రెడ్క్రాస్ చైర్మన్, సభ్యులు కలెక్టర్ను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, పూ ర్వపు కలెక్టర్ రొనాల్డ్రోస్తోపాటు మరో 13మందికి గోల్డ్ మెడల్స్, ఎస్పీ వెంకటేశ్వర్లుకు సేవా అవార్డు, రెడ్క్రాస్ జి ల్లా అధ్యక్షుడు లయన్ నటరాజ్కు గోల్డ్మెడల్, సేవా మెడ ల్ రావడంతోపాటు మరో ముగ్గురికి సేవా మెడల్స్ వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 15న హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులమీదుగా అవార్డులను అందుకోనున్నట్లు నటరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెడ్క్రాస్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.