జడ్చర్ల, ఫిబ్రవరి 15 : జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం స్వామివారికి పూలతేరు (చిన్నతేరు) నిర్వహించారు. వివిధ రకాల పూలతో తేరును సుందరంగా అలంకరించారు. అనంతరం తేరు ఊరేగింపును ప్రారంభించారు.
ఉత్సాహంగా భక్తులు తేరును లాగారు. పూలరథాన్ని తిలకించడానికి ప్రజలు, భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కాగా, గురువారం రథసప్తమి సందర్భంగా గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామికి రథోత్సవం (పెద్దతేరు) నిర్వహించనున్నట్లు ఈవో దీప్తిరెడ్డి తెలిపారు.