పాలమూరు, ఏప్రిల్ 3 : మహబూబ్నగర్లోని ఎం వీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్’ అనే అంశంపై బుధవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ రాజేంద్రకుమార్, ప్రొఫెసర్లు విజయ్కుమార్, ఆంజనేయులు, విజయ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ రాజేంద్రకుమార్ కంప్యూటర్ యొక్క అనువర్తనాలను వివిధ రంగాల్లో ఎలా ఉపయోగిస్తామో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అదే విధంగా ప్రొఫెసర్ ఆంజనేయులు కంప్యూటర్ అనువర్థానాలు ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగం లో ఎలా ఉపయోగించాలో వివరించగా రిటైర్డు అసిస్టెంట్ ప్రొఫెస ర్ కృష్ణారెడ్డి, పీయూ ప్రొఫెసర్ అరుంధతిరెడ్డి, అర్జున్కుమార్ కం ప్యూటర్ ఉపయోగాలు విద్యార్థుల కు వివరించి సావనీర్ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ మిషన్, లెర్నింగ్ క్లౌడ్ కం ప్యూటరింగ్, టాటా సైన్స్ రోబోటిక్స్ డ్రోన్, టెక్నాలజీ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ నిరంజన్గౌడ్, కో కన్వీనర్ మల్లేశ్, రాజశేఖర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింహాచారి, విజయ, హుస్సేన్, అర్చన, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.