మూసాపేట(అడ్డాకుల), మార్చి 25 : కందూరు రామలింగేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథంపై ఆది దంపతులను ప్ర త్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఈ సందర్భంగా ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రంతో కందూరు రామలింగేశ్వరస్వామి క్షే త్రం మార్మోగింది. ఆదివారం మధ్యరాత్రి కాముడి దహనం అనంతరం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా నిత్యోపాస న, రుద్రహోమం, బలిహరణ పూజా కార్యక్రమా లు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము న సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి కాయలను స మర్పించారు. గొలుసులు, తాళ్లను పట్టుకొని ఓం నమఃశివాయ అంటూ వేలాది మంది భక్తులు పో టీ పడి రథాన్ని ముందుకులాగారు. రథాన్ని ఆ లయం నుంచి జాతర ప్రాంగణం వరకు లాగి తిరి గి యథాస్థానానికి తీసుకెళ్లారు. రథోత్సవంలో చి న్నా పెద్దా తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం రథాంగ హోమం, బలిహరణతోపాటు ప్రత్యేక శాంతి పూజా కార్యక్రమా లు చేపట్టారు. రథోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భూత్పూర్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో అ డ్డాకుల, మూసాపేట, భూత్పూర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం భక్తులకు స్వామివా రి నిజరూప దర్శనానికి అవకాశం కల్పించారు. కా ర్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బందితోపాటు భక్తులు పాల్గొన్నారు.
రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పు రస్కరించుకొని సోమవారం స్వామి వారిని భాజాభజంత్రీలు, తప్పెట్ల మోతల మధ్య ఘ నంగా ఊరేగించారు. అనంతరం పుష్కరిణిలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించి పల్లకీసే వ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.