మక్తల్ టౌన్, జనవరి 6 : రాష్ట్రంలో ఆడపిల్లల కుటుంబానికి ఆర్థిక స్వాలంబన అందించడం కోసమే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎ మ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు బరువు కాకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి రూ.లక్షా116ల ను అందజేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడని తెలిపారు.
ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అం దజేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి ల బ్ధిపొందుతుందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా సీఎం కేసీఆర్ పాలనా కొనసాగిస్తూ దేశానికే తలమాణిక్యంగా రాష్ట్రం మారిందన్నారు. పైండ్లెన ప్రతి ఆడపడచుకు ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నుంచి ఆర్థికసాయం అందుతుందన్నారు. పథకం నుంచి మంజూరైన 70 చెక్కులను లబ్ధ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు.
అనంతరం చెక్కు అందుకున్న కాచ్వార్ గ్రామానికి చెం దిన పల్లవి విష్ణువర్ధన్రెడ్డి దంపతులు ఎమ్మెల్యే చిట్టెంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, తాసిల్దార్ తిరుపతయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పావని, బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, కౌన్సిలర్లు, నా యకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్, జనవరి 6 : తెలంగాణ ప్రభుత్వంలో సీ ఎం కేసీఆర్ అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నారని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎ మ్మెల్యే నివాసంలో పట్టణ ఉర్దూ భవన్ నూతన అధ్యక్షుడి గా ఎన్నికైన ఎండి.జంషీర్ అలీని శాలువాతో శుక్రవారం ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మత ప్రాతిపదిక అన్ని మతాలు, అ న్ని కులాలకు ప్రత్యేక హామీలు ఇస్తూ నెరవేరుస్తున్నారని, అందులో భాగంగా ఉర్దూ భవన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.నర్సింహాగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.