పాలమూరు, మార్చి 19 : పాలమూరు విశ్వవిద్యాలయంలోని పీజీ కళాశాలలో ఎంఎస్ఎన్ ల్యా బొరేటిస్ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్మేళాను నిర్వహించినట్లు ప్లేస్మెంట్ అధికారి డా.అర్జున్కుమార్ తెలిపారు. మేళాను పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగంలో మంచి నడవడిక, ప్రవర్తన ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. ఎంఎస్ఎన్ హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ ఉమారాణి ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రక్రి య, భవిష్యత్తు గురించి వివరించారు. మేళాకు 69 మంది హాజరు కాగా 31 మంది ఎంపికయ్యారు. వారిని వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ఇన్చార్జి రిజిస్ట్రార్ డా.మధుసూదన్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల సిబ్బంది, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధికారులు పాల్గొన్నారు.