దేవరకద్ర, అక్టోబర్ 19 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మండలంలోని గోపన్పల్లిలో ఎంపీటీసీ ఆంజనేయులు, సర్పంచ్ రజితాభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. గోపన్పల్లిలో ఎంపీటీసీ, సర్పంచ్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయభాస్కర్రెడ్డి, దశరథ, కృష్ణ, యాదగిరి, బాలరాజు, శ్రీనివాస్రెడ్డి, సత్యంసాగర్, రాము, రాధాకృష్ణ, యుగేందర్రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల) అక్టోబర్ 19 : కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అడ్డాకుల ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి కోరారు. అడ్డాకుల మండలంలోని పొన్నకల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పా ల్గొని ప్రజలకు కారు గుర్తుకు ఓటు వే యాలని కోరారు. అదేవిధంగా అడ్డాకుల, కందూరు, రాచాల, పెద్దమునగల్చేడ్, కాటవరం, తిమ్మాయిపల్లి, గుడిబండ, చిన్నమునగల్చేడ్, శాఖాపూర్, సుంకరామయ్యపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
మూసాపేట, అక్టోబర్ 19 : మూసాపేట మండల కేంద్రంతోపాటు, వేముల, జానంపేట, నిజాలాపూర్, నందిపేట, కొమిరెడ్డిపల్లి, తిమ్మాపూర్, చక్రాపూర్, అచ్చాయపల్లి, తుంకినీపూర్, దాసరిపల్లి, పోల్కంపల్లి, సంకలమద్ది తదితర గ్రామాల్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం చే శారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, మహిళలు తదిత రుల పాల్గొన్నారు.
కొత్తకోట, అక్టోబర్ 19 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను గురువారం బీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఒకటి నుంచి 15వ వార్డుల్లో మ్యానిఫెస్టో అంశాలను ఓటర్లకు అవగాహన కల్పించారు. మండలంలోని పాలెం, రామానంతపురం, అమడబాకుల, రామకృష్ణాపు రం, నాటవెల్లి, నాటవెల్లి తండాతోపాటు ప్రచారం చేశారు. కొత్తకోట పట్టణంలోని 6వ వార్డులో సంధ్య రవీందర్రెడ్డి బావిలో దిగిన కూలీలకు బీఆర్ఎస్ మ్యానిపెస్టోను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, బాబురెడ్డి, ప్రసన్నలక్ష్మి, కౌన్సిలర్లు కొండారెడ్డి, రాములుయాదవ్, సంధ్య, పద్మ, తిరుపతయ్య, ఖాజమైనొద్దీ న్, రామ్మోహన్రెడ్డి, మహేశ్వరి, కోఆప్షన్ స భ్యులు మిషేక్, వహీద్, శ్రీనుజీ, మోహన్కుమార్, రామకృష్ణారెడ్డి, అలీం ఉన్నారు.
మదనాపురం, అక్టోబర్ 19 : నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి హ్యా ట్రిక్ గెలుపు పక్కా అని రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ హనుమాన్రావు అ న్నారు. గురువారం బీఆర్ఎస్ నాయకులు మండలంలోని ఆయా గ్రామాల్లో ఆల వెంకటేశ్వర్రెడ్డి తరఫున ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల మ్యానిఫెస్టో వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, సింగిల్విండో వైస్ చైర్మన్ శ్రీనివాసులు, కోఆప్షన్ సభ్యుడు చాంద్పాషా పాల్గొన్నారు.