గద్వాల రూరల్, ఫిబ్రవరి 21 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బుధవారం జమ్మిచేడులోని మెట్టినింటికి చేరింది. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి భక్తులకు అభయమివ్వాల్సిన జములమ్మ తన తల్లిగారి ఇంటి (గుర్రంగడ్డ)నుంచి బుధవారం మెట్టినింటికి (జమ్మిచేడు) బయలుదేరింది. మంగళవా రం అమ్మవారిని తీసుకురావడానికి సారె తో ఎద్దుల బండి వెళ్లింది. సాయంత్రానికి గుర్రంగడ్డకు చేరుకున్న తర్వాత అక్కడ అమ్మవారికి పూజలు చేశారు. రాత్రి అవుతుండగానే జములమ్మను కృష్ణానదిలో పు ట్టి ద్వారా బయటికి తీసుకువచ్చారు. అక్క డ ఎద్దులబండిపైన అమ్మవారిని కూర్చొబె ట్టి భాజా భజంత్రీలతో బీరెల్లి, లత్తీపురం, వెంకటోనిపల్లి మీదుగా తెల్లవారుజామున నాలుగు గంటలకు జమ్మిచేడుకు చేరుకున్న ది.
ఆయా గ్రామాల్లో అమ్మవారికి ప్రజలు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అమ్మవారు ఆలయానికి చేరిన తర్వా త ఆలయ చైర్పర్సన్ గాయత్రి, ఈవో పు రేందర్ ఆధ్వర్యంలో అమ్మవారిని స్వాగతించి ఆలయంలోకి చేర్చి పూజలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యో తి, జెడ్పీ చైర్పర్సన్ సరిత అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు కాంబ్లె, జానకీరాములు, అభిలాష్, రాము, శంకర్, ఆల య సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.