బాలానగర్: మత్య్సకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 90 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు.
గత ప్రభుత్వాల హయాం లో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వంద శాతం రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలను సరఫరా చేస్తుందన్నారు. ఈ సంవత్సరం జడ్చర్ల నియోజకవర్గంలో (515) చెరువులను గుర్తించామని, వీటిలో ఒక కోటి చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీ కమల, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ వెంకటాచారి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, టీఆర్ఎస్వీ సుప్ప ప్రకాశ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు మంజునాయక్, గుడిసెల యాదయ్య, నాయకులు అరుణ్కుమార్, నితీశ్, శ్రీకాంత్, సతీశ్రెడ్డి ఉన్నారు.