మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 24 : షార్ట్సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కోడూరు సమీపంలో చేరుకుపల్లి ఆగ్రో ప్రాడక్ట్ కంపెనీలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. అగ్ని మాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ మహబూబ్నగర్ రూరల్ మండలంలోని కోడూర్ గ్రామ సమీపంలోని రాంరెడ్డిగూడెం వద్ద కొన్నేళ్లుగా చెరుకుపల్లి ఆగ్రో ప్రాడక్ట్ కంపెనీ పేరుతో అక్కడ రైస్ బ్రౌన్ (తౌడు), ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. అయితే శనివా రం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గుర్తించిన స్థానికులు వెంటనే కంపెనీ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక అధికారులు, పో లీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేలోగా కంపెనీలో విలువైన సామగ్రితోపాటు ట్రాక్టర్ మం టల్లో దగ్ధమైంది. అయితే గోదాంలో తౌడు ఎక్కువగా ఉండడంతోపాటు పూర్తిగా నూనె పదార్థం కావడంతో మంటలు క్షణాల్లో పెద్దగా వ్యాపించా యి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చే యగా అప్పటికే దాదాపు రూ.2 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగిందని కంపెనీ యజమానులు తెలిపారు. ఈ ఘటనపై అగ్నిమాపక అధికారులు కేసు నమో దు చేసి ఎంత మేర ఆస్తినష్టం జరిగిందని దర్యాప్తు చేపట్టగా ఇన్సూరెన్స్ అధికారులు సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.