పాలమూరు, ఫిబ్రవరి 28 : మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో శ్రీధర్సుమన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 11,467మందికి గానూ 11,040 మంది విద్యార్థులు హాజరుకాగా 427 మంది గైర్హాజరయ్యారన్నారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 28 : జడ్చర్లలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 1,368 మంది విద్యార్థులు హాజరుకావాలి. కా గా 1,294 మంది పరీక్ష రాయగా 74మం ది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 197మందికిగానూ 187మంది, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 297మందికిగానూ 291మంది, విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో 373 మందికిగానూ 339మంది, వైష్ణవి జూనియర్ కళాశాలలో 311మందికిగా నూ 297మంది, చైతన్య జూనియర్ కళాశాలలో 190 మందికిగానూ 180 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా పరీక్ష కేంద్రాలను పరిశీలకులు ఉమామహేశ్వర్, రవీందర్రెడ్డి పర్యవేక్షించారు.
నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 28 : ఇం టర్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేయగా జనరల్ విద్యార్థులు 3,981మందికిగానూ 3,803 మంది ప రీక్ష రాశారు. ఒకేషనల్లో 589మందికిగానూ 559 మంది హాజరైనట్లు కన్వీనర్ సుదర్శన్రా వు తెలిపారు. డీఈసీ బృందం మద్దూర్లో, దా మరగిద్ద, నారాయణపేటలో ఫ్లయింగ్స్క్వాడ్, ఉట్కూర్, మక్తల్లో సిట్టింగ్ స్కాడ్, కోస్గి, మరికల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 28 : అ డ్డాకుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొ త్తం 293 మంది విద్యార్థులకు గానూ 289 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆ కళాశా ల ప్రిన్సిపాల్ అంజన్కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తాసీల్దార్ ఘన్సీరామ్ తనిఖీ చేశారు. కళాశాల అవరణలో ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 28 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, భవిత జూనియర్ కళాశాలల్లో బుధవారం ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఊర్మిళ తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 605 మంది విద్యార్థులకు గానూ 572 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 33 మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు. పరీ క్ష కేంద్రం వద్ద ఎస్సై నాగన్న పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 28 : ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పారమెడికల్ క ళాశాల విద్యార్థులు 214 మందికి గానూ 199 మంది పరీక్ష రాయగా 15మంది గైర్హాజరైనట్లు పరీక్ష సూపరింటెండెంట్ సుగ్నేశ్ తెలిపారు.