ఇంటర్ పరీక్షలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 119 పరీక్షా కేంద్రాల్లో 64,257 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 31 కేంద్రాల్లో 13,303 మంది, గద్వాలలో 13 కేంద్రాల్లో 9,228 మంది, నారాయణపేటలో 17 కేంద్రాల్లో 8,554 మంది, వనపర్తిలో 26 కేంద్రాల్లో 12,948 మంది, పాలమూరులో 32 కేంద్రాల్లో 20,224 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్షలు జరగనున్నాయి. పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. కాగా వందశాతం ఉత్తీర్ణత సాధించాలంటే భయం వీడితేనే సాధ్యమవుతుందని విద్యానిపుణులు, అధ్యాపకులు సూచిస్తున్నారు.
నాగర్కర్నూల్, (నమస్తే తెలంగాణ)/మక్తల్టౌన్, మార్చి 13 : ఇంటర్ పరీక్షలకు విద్యార్థు లు సన్నద్ధమయ్యారు. ఈనెల 15 నుంచి ఏ ప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలతోపాటు మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు పూర్తయ్యాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించేదుకు ప్రభుత్వ కళాశాలల్లో అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ క్రమంలో వార్షిక పరీక్షలను పకడ్బందీగా ని ర్వహించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటర్ నోడల్ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన కేంద్రాలను ఎంపిక చేశారు. సీసీ కెమెరాలను బిగించనున్నా రు. ఎండాకాలం కావడంతో కేంద్రాల వద్ద తా గునీటి వసతి కల్పించనున్నారు.
విద్యార్థులు అ నారోగ్య లక్షణాలకు గురైతే చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు, మందులను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెం ట్లు, కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్కాడ్లు, సిట్టింగ్ స్కాడ్లు, డీఈసీ స్కాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సె క్షన్ అమల్లో ఉండనున్నది. పరీక్ష జరిగే మూడు గంటలపాటు ఆయా కేంద్రాల సమీపంలో ఉన్న జీరాక్స్ కేంద్రాలను మూసి వేయనున్నారు.
ఎవరైనా జీరాక్స్ సెంటర్లు ఓపెన్చేస్తే క్రిమినల్ కేసు లు నమోదు చేయనున్నారు. విద్యార్థులను ప్రైవే ట్ కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి చేసే పరిస్థితులు ఏర్పడతాయని భావించిన విద్యా శాఖ హాల్టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లే దని స్పష్టం చేసింది. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతో కేంద్రాలకు చేరుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 119 ప రీక్షా కేంద్రాల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 64,257 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల్లో 20:1 నిష్పత్తి ప్రకా రం ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి కేం ద్రం వద్ద ఆరోగ్య మిత్రలను ఏర్పాటు చేసింది. పరీక్షలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆయా రూట్లలో ఉదయం 7:30 నుంచి ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు కలెక్టర్లు ఆదేశాలిచ్చా రు.
ఈ నెల 15వ తేదీ నుంచి ప్రా రంభమయ్యే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చే శాం. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దూర ప్రాం తాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం టీఎస్ఆర్టీసీ ద్వా రా ప్రత్యేక బస్సులను నడపనున్నాం. ఈ మేరకు డీఎంలకు ఆదేశాలిచ్చాం.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్, నారాయణపేట
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 8:45 నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నాం. నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతిం చం. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకూడదు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దు.తప్పకుండా రివిజన్ చేయాలి. బట్టీ విధానానికి స్వస్తి పలికి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ప్రశ్నాపత్రంలో కచ్చితంగా తెలిసిన వాటికి ముందుగా జవాబులు రాయాలి.
– హృదయరాజు, డీఐఈవో, జోగుళాంబగద్వాల
నాగర్కర్నూల్ జిల్లాలో ఇం టర్ పరీక్షల నిర్వహణకు 31 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వృత్తివిద్యతోపాటు ఫస్టియర్, సెకండియర్లో కలిపి 13వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 31 మంది సీఎస్లు, 31 మంది డిపార్ట్మెంటల్, ప్రైవేట్ కళాశాలలకు 12 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు కస్టోడియన్లు , ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లు, ఇద్దరు సిట్టింగ్ స్కాడ్లు, ఒక డీఈసీ స్కాడ్ను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పునఃశ్చరణ చేపట్టాలి. గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలి.
– వెంకటరమణ, ఇంటర్ నోడల్ అధికారి, నాగర్కర్నూల్