పాలమూరు కీర్తి నలుదిశలా వ్యాపించింది. కరోనా సమయంలో వేతనం తీసుకొనేందుకు ఇష్టపడని ఉపాధ్యాయుడు శ్రీధర్ విద్యార్థుల కోసం ఏదో చేయాలనుకున్నాడు.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి కొత్త కొత్త ఇన్నోవేషన్లకు నాంది పలికాడు. కలాం డ్రీమ్ ఫోర్స్ పేరిట ప్రయోగశాలను నిర్మిస్తున్నాడు. విద్యార్థులకు ప్రయోగాలపై మక్కువ కల్పించి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అతడి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఏకంగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నవాబ్పేట మండలం యన్మన్గండ్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి సక్సెస్ స్టోరీ..
మహబూబ్నగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సమయం లో పనిచేయకుండా వచ్చిన జీతాన్ని తీసుకునేందుకు ఇష్టం లేక ఆ డబ్బును పేద విద్యార్థులకు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పూనుకున్నాడు. అబ్దుల్కలాం డ్రీమ్ ఫోర్స్ పేరిట ఏకంగా ప్రయోగశాలను నిర్మిస్తున్నా డు. సైన్స్ ఉపాధ్యాయుడిగా పాఠాలు మాత్రమే చె ప్పకుండా.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గు ర్తించి భావి శాస్త్రవేత్తలుగా తయారుచేయాలన్నదే లక్ష్యంగా ఎన్నో ఇన్నోవేషన్లకు నాంది పలికాడు. దీంతో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. నవాబ్పేట మండలం యన్మన్గండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీఎన్ శ్రీధర్ వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ సేవలపై ప్రత్యేక కథనం..
కలాం డ్రీమ్ఫోర్స్..
రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్కలాంను ఆదర్శంగా తీసుకొని.. విద్యార్థులకు తన విభిన్న శైలితో పాఠాలు బోధించి శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు శ్రీధర్ కంకణం కట్టుకున్నాడు. ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ఫెయిర్లో పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు వచ్చాయి. కరోనా కాలంలో పనిచేయకున్నా జీతం వచ్చిందనే భావనతో తన 16 నెలల జీతం (రూ.12లక్షలు)తో ప్రయోగశాలను నిర్మిస్తున్నాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్లో తన సొంత ఇంటిపై కలాం డ్రీమ్ఫోర్స్ పేరిట ప్రయోగశాలకు అంకురార్పణ చేస్తున్నాడు. పేద విద్యార్థులు ఇన్నోవేషన్లను ఉచితంగా తయారుచేసేందుకు ఉపయోగించుకోవచ్చని చెబుతున్నాడు. వారికి ఉన్న సందేహాలను శాస్త్రవేత్తలతో నివృత్తి చేయిస్తానంటున్నాడు.
డెఫ్అండ్డమ్ యంత్రంతో అంతర్జాతీయ అవార్డు..
2016లో తమ పాఠశాలలో పనిచేసే అటెండర్ కు మూగ, చెవుడు. ఆయన సేవలు వినియోగించుకోవాలంటే దగ్గరకు వెళ్లి సైగ చేయాలి. ఇది ఇబ్బందిగా మారింది. ఆయన వద్దకు వెళ్లే అవసరం లేకుం డా విద్యార్థులతో కలిసి ఓ డివైస్ను శ్రీధర్ తయారుచేశాడు. అ లార్మింగ్ ఎయిడ్ ఫర్ డెఫ్అండ్డమ్ పేరిట తయారు చేసిన అలారం డివైస్ను మూగ, చెవిటి వాళ్ల చేతికి బిగిస్తారు. అందులో ఉన్న అంకె ల సంకేతాలను ముందుగానే తెలుసుకునేలా ఏర్పా టు చేసి.. పాఠశాల గదుల్లో స్విచ్లు ఏర్పాటు చేశా రు. హెచ్ఎం గదిలో స్విచ్ నొ క్కితే ఆ డివైస్కు 1 నెంబర్ సంకేతం వెళ్తుంది. అంటే హెచ్ఎం పిలుస్తున్నాడని అర్థం. ఇలా ఆయా తరగతి గదులకు నెంబ ర్లు కేటాయించారు. ఈ ఇన్నోవేషన్కు రాష్ట్ర స్థాయి లో ప్రథమ బహుమతి వచ్చింది. తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన ఒకే ఒక ప్రయో గం ఇది. జపాన్లో వారం రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సుకు విద్యార్థిని లక్ష్మిని సొంత ఖర్చులతో తీసుకెళ్లి శభాష్ అనిపించుకుంటున్నాడు.
చాలా మంది జీవితంపై విరక్తి చెంది ఫ్యాన్కు ఊరేసుకుంటుంటారు. ఫ్యాన్కు ఉరి బిగియకుండా ఉండేలా కొత్త ఫ్యాన్లను విద్యార్థులతో కలిసి శ్రీధర్ తయారుచేశాడు. ఈ ప్రయోగం కూడా రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను గుర్తించి పాఠశాలలోనే ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేసి బోధిస్తున్నాడు. ఇలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న శ్రీధర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.