జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 21 : జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. న్యాక్ బృందం చైర్మన్, కర్ణాటక హసన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ తారనాథ్ నేతృత్వంలో సభ్యులు వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ జైచంద్రారెడ్డి, అస్సోం రాష్ర్టానికి చెందిన విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బిమల్ బరాహ్ జోర్హట్, తె లంగాణ ఉన్నత విద్యాశాఖ సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ రాజేందర్సింగ్ పర్యటించారు.
న్యాక్బృందం కళాశాలలో అన్ని విభాగాలను పరిశీలించి విద్యాబోధనలు, సదుపాయాలను గు రించి ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పూర్వ విద్యార్థులు, పేరెంట్స్ కమిటీలతోపాటు ప్రస్తుత విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమై కళాశాల స్థితిగతులను తెలుసుకున్నారు. అయితే కళాశాలలోని సదుపాయాలు, విద్యబోధనలపై న్యాక్బృందం సంతృప్తిని వ్యక్తం చే సింది. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను న్యాక్ బృందం తిలకించి విద్యార్థులను అభినందించారు.