పేపర్ దొరికిందంటే చాలు ఆమె చేతులు అద్భుతాలు చేస్తాయి.. వివిధ రకాల బొమ్మ లు, అలంకరణ వస్తువులతో ఔరా అనిపిస్తున్నది. శ్రీశ్రీ చెప్పిన విధంగా.. ‘అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల.. కాదెది ‘కవిత’ కన ర్హం. చీపురు పుల్ల.. కాగితం ముక్క.. అట్టపె ట్టె.. చివరకు తిని పారేసే పిస్తా పట్టు కూడా కాదేది క్రియేటివిటీకి అనర్హం అని నిరూపిస్తున్నది. మహబూబ్నగర్కు చెందిన కవిత క్రి యేటివిటీకి కేరాఫ్గా మారింది. డిగ్రీ పూర్తి చేశాక వివాహమై తర్వాత కొడుకు పుట్టిన త ర్వాత హిందీ పండిత్ ట్రైనింగ్ను ఆమె పూర్తి చేసింది. ఐదేండ్లు కేశవరెడ్డి స్కూల్లో హిందీ టీచర్గా పనిచేశారు.
ఆమె భర్త శివప్రసాద్ స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ప్రోత్సాహంతోనే అలంకరణ వస్తువులు తయా రు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలా తన ప్రతిభకు పదునుపెట్టింది.
పేపర్తో ఫ్లవర్వాజ్లు, బుట్ట బొమ్మలు, పూల బుట్టలు, సైకిల్ బొమ్మలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో వస్తువులు ఆమె చేతుల మీదుగా తయారుకావాల్సిందే.. మనం పిస్తా తిన్న తర్వాత పొట్టును పడేస్తాం.. కానీ ఆమె మాత్రం పొట్టుతో డోర్ ఆర్చీలు, దీపావళి దీపాలు, అలంకరణ వస్తువులు.. ఇలా ఎన్నో రకాల బొమ్మలు తయారు చేసి తన టాలెంట్తో అబ్బురపరుస్తున్నది.
అలాగే కాడ్బోర్డులతోనూ, పెన్సిల్ పొట్టుతోనూ ఇంకా ధారాలతోనూ, చీపురు పుల్లలతోనూ అలంకరణ, ఇతర వస్తువులను సృష్టిస్తున్నది. ఖాళీ సమయం దొరికితే చాలు ఏదైనా వెరైటీగా.. అందం గా.. తయారు చేయడం తన హాబీ అని కవిత చెబుతున్నది. తయారైన వస్తువులను చూసి అందరూ అభినందిస్తుంటే సంతోషం, సంతృప్తిని ఇస్తుందంటున్నారు. ఈ క్రియేటివిటీని పది మందికి తెలిసేలా, ఉపయోగపడేలా ప్రయత్నించాలన్నదే నా ఆకాంక్ష.. భవిష్యత్తులో ఏదైనా స్వయం ఉపాధి శిక్షణ సంస్థని నెలకొల్పాలని నా కోరిక అని తన మనస్సులోని మాటను బయటపెట్టింది.. ఇన్నోవేటివ్ ఉమెన్.
– బందిగె గోపి, ఫొటోగ్రాఫర్ మహబూబ్నగర్