జడ్చర్ల, డిసెంబర్ 1 : రోజురోజుకూ ధాన్యం ధరలు పె రుగుతున్నాయి. బాదేపల్లి మార్కెట్లో గురువారం ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం క్వింటాకు రూ.2,429 ధర వచ్చింది. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కంటే ఇక్కడే రికార్డుస్థాయి ధర వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మార్కెట్కు 5,367 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ ధాన్యం అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.2,429, మధ్యస్తంగా రూ.2,411 ధర పలికింది. 964 క్వింటాళ్ల హంస రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,217, మధ్యస్తంగా రూ.1,856.., 1,027 క్వింటాళ్ల మొక్కజొన్న రాగా గరిష్ఠంగా రూ.2,283, మధ్యస్తంగా రూ.2,233.., 50 క్వింటాళ్ల సోన రాగా గరిష్ఠంగా రూ.1,909.., నాలుగు క్వింటాళ్ల చిట్టిముత్యాలు రాగా గరిష్ఠంగా రూ.3,224, ఐదు క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్ఠంగా రూ.4,280 ధర వచ్చింది.
వేరుశనగ @ రూ.8,930
వనపర్తి, డిసెంబర్ 1 : వనపర్తి జిల్లా కేంద్రంలోని మా ర్కెట్ యార్డుకు వేరుశనగ భారీగా తరలివస్తున్నది. గురువారం 201 బ్యాగులు రాగా.. క్వింటాకు అత్యధికంగా రూ.8,930, అత్యల్పంగా రూ.5,230 వచ్చినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ లక్ష్మయ్య తెలిపారు.
సోన @ రూ.2,351
నారాయణపేట టౌన్, డిసెంబర్ 1 : పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం 5,653 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 675 క్వింటాళ్ల హంసరకం విక్రయా లు జరగగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.2,315, కనిష్ఠంగా రూ.1,583 ధర పలికింది. 2,978 క్వింటాళ్ల సోన రాగా.. గరిష్ఠంగా రూ.2,351, కనిష్ఠంగా రూ.1,629 ధర వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.