ఇటిక్యాల, మే 22 : మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. ఇటిక్యాల మండలం కొండేర్లో అంబేద్కర్, బాబు జగ్జీవన్రాం విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథంతో కలిసి వారు ముఖ్యఅతిథులుగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద మాట్లాడుతూ చదువుకొని సంఘటితం కావాలని.. పోరాటం చేయాలని అంబేద్కర్ సూచించాడన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన గొప్పనాయకుడు బాబుజగ్జీవన్రాం అని కొనియాడారు. ఎమ్మెల్సీ చల్లా మాట్లాడుతూ గ్రామం లో ఇద్దరు మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం అ భినందనీయమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడన్నారు. తెలంగాణ ప్రభు త్వం వచ్చాక సామాజిక న్యాయం అమలువుతున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో అత్యంత ఎత్తయిన అం బేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
మహనీయులు చూపిన మా ర్గంలోనే అందరూ ముందుకు సాగాలన్నారు. ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ ఆధునిక భారతావనిని నిర్మించిన దార్శనీకుడు అంబేద్కర్ అని అన్నారు. అనంతరం వక్త లు జేబీ రాజు, జెడ్పీ మాజా చైర్మన్ బండారి భాస్కర్, బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మంద శ్రీనాథ్, ఎంపీపీ స్నేహ, జెడ్పీటీసీ హన్మంత్రెడ్డి, అలంపూర్ మా ర్కెట్కమిటీ మాజీ చైర్మన్ విష్ణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరన్న, వడ్డేపల్లి శ్రీనివాసులు, పల్లెపాడు శంకర్రెడ్డి, పెబ్బేర్ జెడ్పీటీసీ పద్మ, మాజీ జెడ్పీటీసీ సుందర్, నత్తనేలు, మాజీ వైస్ఎంపీపీ శేఖర్గౌడ్, బషీర్మియ్యా, బొంకూర్ శ్రీనివాస్రెడ్డి, బోరవెల్లి శేషిరెడ్డి, వడ్డేపల్లి వైస్ఎంపీపీ చంద్రగౌడ్, రామిరెడ్డి, అంజి, గోవర్ధన్, గిడ్డారెడ్డి, రఘు, ఏకాంత్, ఆత్మలింగారెడ్డి, దానం, దుబ్బన్న, నియోజకవర్గ ముఖ్యనాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.