ఆత్మకూరు, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్లోకి వచ్చిన ప్రతిఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ఇంటిపార్టీ అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం హాజరై పార్టీలో చేరినవారిని కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ దేశంలో టీఆర్ఎస్ లాంటి పార్టీ ఎక్కడా లేదన్నారు. పట్టణంలోని వెల్డర్ అసోసియేషన్ తరఫున దాదాపు 20మంది కార్యకర్తలు పార్టీలో చేరినట్లు రవికుమార్యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రీయాదవ్, వైస్చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కౌన్సిలర్లు, అనుబంధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.