గద్వాల, అక్టోబర్ 13 : సమాజంలో ఆడపిల్లలకు చదువే ఆధారమని, ప్రతి విద్యార్థిని ఉన్నత చదువులు చదివి వారి కాళ్లపై వారు నిలబడాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్స వం సందర్భంగా ఐడీవోసీ సమావేశ హాల్లో శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళలపై దుష్ప్రచారాలు నడుస్తున్నాయని, వాటిని నిరోధించాలన్నారు. ఎవరి భవిష్యత్ వాళ్ల చేతుల్లోనే ఉందని, ప్రతి బాలిక పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఇష్టపడి చదవాలని, ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఐదో తరగతి చదివే సమయంలో తన తల్లి చెప్పిన మాటలకు స్ఫూర్తి పొంది ఐఏఎస్ వరకు చదివినట్లు కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ స్కిల్ డెవలప్ ఉండాల ని, చాలెంజ్గా తీసుకొని చదువులో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇంట్లో మీస్థానం మరింత పెరగాలంటే చదువే ముఖ్యమన్నారు. కిశోర బా లికలు పౌష్టికాహారం తీసుకోవాలని, రక్తహీనత లేకుం డా చూసుకోవాలన్నారు.
నేటి బాలికలే రేపటి మహిళలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే రేపటి సమాజం బాగుంటుందన్నారు. చదువే బాలికలకు ఆధారం, ధైర్యమని, చదువును ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగాలన్నారు. బాలికా విద్యకు ప్రభుత్వం కేజీవీబీలు ఏర్పాటు చేసిందని, వాటిని వినియోగించుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలని సూచించారు. ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టలాలని అదనపు కలెక్టర్ అన్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే చదువుతోపాటు ఆత్మైస్థెర్యం కూడా అవసరమన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ మహిళలు చదువుకు దూరంగా ఉన్నారన్నారు. విద్యార్థినులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల అలవాట్లపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజేతలకు కలెక్టర్ మెమెంటోలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు రమేశ్బాబు, హృదయరాజు, సిద్ధప్ప, రమాదేవి, ముసాయిదాబేగం, విద్యార్థినులు పాల్గొన్నారు.
చిన్నారుల కోసం క్రస్ రూం: కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు సంబంధించిన ఐదేండ్లలోపు పిల్లల సంరక్షణ కోసం క్రస్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళా ఉద్యోగులు తమ పిల్లలను అందులో వదిలి తమ పని చూసుకోవచ్చని సూచించారు. శుక్రవారం ఐడీవోసీలో శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రస్ రూంను కలెక్టర్ పరిశీలించారు. అందులో చిన్నారులకు ఆటవస్తువులు, వారిని చూసుకోవడానికి ఆయాలు కూడా ఉంటారని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళా ఉద్యోగినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, అధికారులు ముసాయిదాబేగం, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.