నారాయణపేట టౌన్/ రూరల్, ఏప్రిల్ 6: పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బారంబావి శివా లయం వద్ద ఎస్పీ వెంకటేశ్వర్లు, అఖిల పక్ష నాయకులు విజ య్సాగర్, నాగూరావునామాజీ తదితరులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీసీఆర్బీ డీఎస్పీ వెంకటేశ్వ ర్రావు బందోబస్తును పర్యవేక్షించారు. ప్రధాన వక్తగా హా జరైన రాధామనోహర్దాస్జీ మాట్లాడుతూ దేశాన్ని నిలబె ట్టేది యువకులేనని తెలిపారు. మతం కంటే మానవత్వం గొప్పదన్నారు. రామానుజులు, అన్నమాచార్యులు పుట్టిన గొప్ప దేశంలో మనం జన్మించామని, ప్రతిఒక్కరూ ప్ర శ్నించే తత్వాన్ని అలవరచుకోవాలన్నారు.
హనుమజ్జయంతిని పురస్కరించుకొని సాయి విజయకాలనీ సింగార్భేస్లోని హనుమాన్ ఆలయం, మూలహనుమాన్ మందిరం, పళ్లలోని మూలహనుమాన్ మందిరం, బాపూనగర్, గొడుగుగేరి, అశోక్నగర్లోని అభయాంజనేయస్వా మి ఆలయాల్లో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి డోలా రోహణం తదితర పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భక్తులకు అన్నదానం చేశారు. పళ్లలోని మూలహనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేకంగా అంబలి వితరణ చేసి యువకులకు రెట్టపట్ల పోటీలు నిర్వహించారు. జాజాపూర్, తిర్మలాపూర్, శేర్నపల్లి తదితర గ్రామాల్లో స్వామి వారికి పూజలు నిర్వహించారు. తిర్మలాపూర్లో హనుమాన్ చిత్రపటాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో వార్డు సభ్యురాలు లక్ష్మీ,వెంకటయ్య, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రాములు, నర్సింహ,మల్లేశ్, రాములు పాల్గొన్నారు.
ఊట్కూర్, ఏప్రిల్ 6: మండలకేంద్రంతోపాటు పరిసర గ్రామాల్లో హనుమాన్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. పగిడిమర్రి గ్రామంలో ఆంజనేయ రథోత్స వం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరై ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించా రు. ఊట్కూర్, బిజ్వారం, పెద్దజట్రం, పులిమామిడి, నిడుగుర్తి గ్రామాల్లో యువకులు సాయంత్రం వీరహనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. జై బోలో వీరహనుమాన్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, సులోచన, మాజీ సర్పంచ్ బస్వరాజ్గౌడ్, మురళీధర్రెడ్డి, నారాయణగౌడ్, విష్ణుమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోస్గి , ఏప్రిల్ 6: హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర కనులపండువగా సాగింది. గురువారం పట్టణంలోని తిమ్మన్నబావి శివాంజనేయస్వామి ఆలయంనుంచి ప్రారంభమైన శోభాయాత్ర రామాలయం శివాజీచౌరాస్తా బీసీకాలనీ సాయినగర్కాలనీ బాహర్పేట్ మీదుగా సాగింది. శోభాయాత్రలో పాఠశాల విద్యార్థుల వేషధారణ అందరినీ ఆకర్శించింది. కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ నాయకులు, గ్రామయువకులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, ఏప్రిల్ 6: పట్టణంలోని మారుతీనగర్లో వెలిసిన డోంగుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా ప్రారంభమైనట్లు ఆలయకమిటీ సభ్యులు తిరుపతి కిష్టప్ప,శ్రీనివాసులు అన్నారు. గురువారం ఉదయం 10గంటలకు పడమటి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పల్లకీసేవ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్ర త్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క మిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, ఏప్రిల్ 6: మండలంలో హనుమాన్ జ యంతి వేడుకలను కనులపండువగా నిర్వహించారు. జక్లే ర్, ఉప్పర్పల్లి, గడ్డంపల్లితోపాటు అన్ని గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాలు చేపట్టారు.
ఘనంగా పడమటి ఆంజనేయస్వామి పల్లకీసేవ
మరికల్, ఏప్రిల్, 6: మండల కేంద్రంలోని పడమటి ఆంజనేయస్వామికి గురువారం ఘనంగా పల్లకీసేవ నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు భజనలు చేస్తూ పాత బస్టాండ్ చౌరస్తా నుంచి పల్లకీసేవ కొనసాగింది.
మండల కేంద్రంలోని కంచుకోటవీధిలో ఆంజనేయ స్వామికి ఎంపీటీసీ గోవర్ధన్గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంత్రోనిపల్లిలో సర్పంచ్ శాంతమ్మ ఆధ్వర్యంలో దాసంగాలు పెట్టిమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గున్ముక్ల గ్రామంలో నాగరాజు ప్రత్యేక పూజలను చేశారు.
మాగనూర్, ఏప్రిల్ 6: మాగనూర్ మండలకేంద్రం తోపాటు వివిధ గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని లక్ష్మీనర్సిం హ ఆలయం నుంచి ట్రాక్టర్పై హనుమాన్ చిత్రపటంతో జెండాలతో గ్రామంలోని వీధులగుండా శోభాయాత్ర ని ర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు ఎంపీపీ గ్రామస్తులు సాభి, అశోక్గౌడ్ కృష్ణయ్య, రమేశ్గౌడ్, ఈడిగి వాకిటి వాభయ్య నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్ ఏప్రిల్: 6 మక్తల్ ప్రాంతంలో పడమటి అంజన్న ఆశీస్సులతో నియోజకవరమంతా పచ్చటి పంట పైర్లతో కళకళలాడుతున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఛత్రపతి శివాజీనగర్ నుంచి చేపట్టిన వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే చిట్టెం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంజనేయస్వామికి ప్రత్యే క పూజలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఆంజనేయు డు ఉంటాడని ఆంజనేయస్వామి ఉన్న గ్రామం సుఖశాంతులతో ఉంటుందన్నారు. అనంతరం హారతి ఇచ్చి విజయోత్సవ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదవనగర్, బ్రాహ్మణ వాడి, గాంధీ చౌక్, ఆజాద్నగర్ మీదుగా ర్యాలీ పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నది. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్నేత శ్రీనివాస్గుప్తా, పట్టణాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, నాయకులు రామలింగం, కా వలి తాయప్ప, బండారి శేఖర్, నేతాజీ, సాగర్, ఈశ్వర్, శివరెడ్డి, బండారి ఆనంద్, బీజేపీ నాయకులు కొం డ య్య, కర్నిస్వామి, బలరాంరెడ్డి, టీడీపీ నాయకుడు మ ధుసూదన్రెడ్డితోపాటు, భజరంగ్దళల్, వీహెచ్పీ కార్యకర్తలు ఉన్నారు.