హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : నూతనంగా నియామకమైన నర్సింగ్ అధికారులకు తృతీయ విడత ఇండక్షణ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెరుగైన వైద్యసేవలందించడంలోని నైపుణ్యం, నైతిక విలువలు, కరుణ, రోగి కేంద్రిత సేవాభావంపై అవగాహన కల్పించారు.
నర్సింగ్ అధికారుల బాధ్యతలు, ప్రభుత్వ సేవా నియమాలు, పరిపాలనా విధానాలు, చట్టపరమైన అంశాలు, ఇన్ఫెక్షన్ నివారణ, కమ్యూనికేషన్, సాక్ష్యాధారాల ఆధారిత లాంటి అంశాలను సమగ్రంగా వివరించారు. కార్యక్రమాన్ని వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్ నరేందర్కుమార్ ప్రారంభించారు.