మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 3 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ భళా అనిపిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వా ల, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్, వెంకటగిరి, మంగళగిరి, చీరాల, ఉప్పాడ, కంచి, ధర్మవరం వంటి చీరలను స్టాళ్లల్లో విక్రయిస్తున్నారు.
పట్టువస్ర్తాలు, డ్రెస్మెటీరియల్స్, బెడ్షీట్స్, టవల్స్ వంటి ఎన్నో చేనేత వస్ర్తాలను అమ్ముతున్నారు. అంతేకాకుండా కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, నిర్మల్ టాయ్స్, హైదరాబాద్ ముత్యాలు, మైసూర్ రోజ్ఉడ్, సహారన్ పూర్ ఉడ్కార్వింగ్, వరంగల్ లెదర్ బ్యాగు లు, బంజారా ఎంబ్రాయిడరీ, బెంగాల్ జ్యూట్ బ్యాగ్ వంటి ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుమారు రెండువేల రకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచారు.